పొడుగుకాళ్ల సుందరి, హీరోయిన్ పూజా హెగ్డే గురించి జనాలకు చెప్పాల్సిన పని లేదు. ఆమె తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా, 'అల వైకుంఠపురం,' 'అరవింద సమేత' సినిమాలు ఆమెకి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టాయి అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో పూజ తెలుగు వారికి ఇష్టమైన నటిగా మారిపోయింది అందంలో అతిశయోక్తి లేదు. దాంతో ఇక పూజ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలను చేసి తన సత్తాని చాటుకుంది. అయితే ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు మాత్రం తెలుగులో అడపాదడపా మాత్రమే కనబడుతోంది అని మీకు తెలుసు. ఇపుడు పూజ కళ్లన్నీ మొత్తం బాలీవుడ్ పైనే ఉన్నట్టు కనబడుతోంది.

ఇక ఆ సంగతులు పక్కన పెడితే, రీసెంట్ గా అబుదాబిలో ఐఫా అవార్డుల వేడుక జరిగిన నేపథ్యంలో పూజ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇలా మాట్లాడుతున్న తరుణంలో సదరు యాంకర్ రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్ గురించి ప్రశ్నించగా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. దర్శకుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో ఆల్రెడీ వర్క్ చేసానని, అందులో కూడా సూపర్ హిట్ మూవీస్‌ లో నటించానని చెబుతూ త్రివిక్ర‌మ్ దర్శకత్వం కంటే కూడా రచనా శైలి చాలా బావుంటుందని చెప్పుకొచ్చింది. అదే విధంగా రాజమౌళిని గురించి మాట్లాడుతూ... రాజమౌళి దర్శకత్వ ప్రతిభ అమోఘం అని చెప్పుకొచ్చింది. దాంతో సదరు యాంకర్ ఒకేసారి వారి ఇద్దరితో సినిమా చేసే ఛాన్స్ వ‌స్తే.. ఎవ‌రి ప్రాజెక్ట్ కు గ్రీన్‌ సిగ్న‌ల్ ఇస్తార‌ని అడిగినపుడు, ఇద్దరూ తనకు ఫేవరేట్ అని, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాజమౌళితో వర్క్ చేయలేదని, అందుకే ఆయనతోనే చేస్తానని చెప్పుకొచ్చింది.

దాంతో ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తుండడం మనం గమనించవచ్చు. త్రివిక్రమ్ అసూయ పడేలా చేయడానికి పూజ అలా చెప్పిందని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు. ఇకపోతే గతేడాది కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌ సినిమాతో సరిపెట్టుకున్న పూజ.. ఇప్పుడు మళ్లీ బిజీ కాబోతోంది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రానున్న పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య గ్యాంగ్‌ స్టర్‌ గా కనిపించనున్నట్లు భోగట్టా. దీంతోపాటు బాలీవుడ్ షాహిద్ క‌పూర్‌ తో యాక్ష‌న్ మూవీ దేవా చేస్తోంది పూజా హెగ్డే. కాంచన-4 మూవీలో కూడా ఆమె నటించనున్నట్లు కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: