టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించి చాలా విజయాలను అందుకున్న కృష్ణ వంశీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన అనేక వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహించి మంచి విజయాలను అందుకోవడం తో ఈయనకు టాలీవు డ్ ఇండస్ట్రీ లో క్రియేటివ్ దర్శకుడిగా పేరు వచ్చింది . ఇక పోతే కొంత కాలం క్రితం ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా సోనాలి బింద్రే హీరోయిన్ గా మురారి అనే మూవీ ని రూపొందించా డు . ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది .

ఈ సినిమాతో మహేష్ బాబు కి అద్భుతమైన క్రేజ్ వచ్చింది. అలాగే సోనాలి బింద్రే కి కూడా ఈ మూవీ తర్వాత తెలుగు లో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇకపోతే ఈ సినిమా తర్వాత కొంత కాలానికి కృష్ణ వంశీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాఖీ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ లో ఇలియానా , చార్మి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం కృష్ణ వంశీ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

అందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా కృష్ణ వంశీ మాట్లాడుతూ ..  జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఆయన నాకు మురారి లాంటి సినిమా కావాలి అని అన్నాడు. ఇక నేను మాత్రం ఆ సినిమా నీకు సెట్ కాదు. నీకు రాఖీ లాంటి సినిమానే సెట్ అవుతుంది అని చెప్పాను అని కృష్ణ వంశీ తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: