ఏంటి హీరోయిన్.. పొలిటిషన్.. అయినటువంటి రోజాని ఆ హీరో షూటింగ్స్ సెట్ లోనే కొట్టాడా.. ఇంతకీ ఆయన ఎవరు? ఎందుకు వారి మధ్య గొడవ వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. వైసిపి  ప్రభుత్వం ఉన్న సమయంలో ఎంతో యాక్టివ్ గా ఉన్న రోజా ఓటమితో సైలెంట్ అయిపోయింది. మళ్లీ లడ్డు వివాదంతో తెరమీదకి వచ్చి యాక్టివ్ అయిపోయింది. అయితే అలాంటి రోజా మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది అనే టాక్ వినిపిస్తోంది. కానీ రోజా కి మళ్ళీ సినిమాల్లో రావాలని లేదని ఇండస్ట్రీ టాక్. అయితే సమయం దొరికినప్పుడల్లా రోజాహీరో ఫ్యామిలీ పై తెగ విమర్శలు చేస్తూ ఉంటుంది. అయి తేఅలా విమర్శలు చేయడానికి కారణం షూటింగ్ సెట్లో జరిగిన గొడవే అని తెలుస్తోంది. ఇక అసలు విషయం ఏమిటంటే..రోజాకి మెగా ఫ్యామిలీ అంటే అస్సలు నచ్చదు. మెగా ఫ్యామిలీ పై ఎప్పుడూ తన విమర్శలు చేస్తూనే ఉంటుంది. చిరంజీవి,పవన్ కళ్యాణ్, నాగబాబు అంటూ ముగ్గురు హీరోలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. 

అయితే రాజకీయాల వరకు ఓకే గానీ అవి శృతిమించడంతో  చిరంజీవికి రోజాకి మధ్య ఆ సినిమా షూటింగ్ సమయంలో కూడా జరిగింది. అందుకే వీరిద్దరి మధ్య అంత సాన్నిహిత్యం లేకపోవడంతో దొరికిందే ఛాన్స్ అనుకోని రోజా వారిపై విరుచు పడుతుంది అని ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపించింది. అయితే ఇదే విషయంపై రోజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు యాంకర్ ని అడగగా.. అలాంటిదేమీ లేదు.నేను చిరంజీవితో  సినిమాల్లో నటించిన సమయంలో ఆయనతో చాలా క్లోజ్ గా ఉండేదాన్ని.అలాగే ఆ టైంలో ఆయన ముగ్గురు పిల్లలు చిన్నవాళ్లు. వారిని నేను ఎంతో ప్రేమగా ఎత్తుకునేదాన్ని అంటూ రోజా తెలియజేసింది.

అయితే ఆ యాంకర్ మిమ్మల్ని చిరంజీవి షూటింగ్ సెట్లో కోపంతో కొట్టారట దవడ పగలగొట్టారు అంటూ రూమర్స్ వచ్చాయి నిజమేనా అంటే.. రూమర్స్ అని మీరే అంటున్నారు. మళ్ళీ వాటిని ఎలా నమ్ముతారు అంటూ రోజా ఇచ్చి పడేసింది.అలాగే మెగా ఫ్యామిలీ పై విమర్శల గురించి మాట్లాడుతూ.. నేను ఆ ఫ్యామిలీకి సంబంధించిన పార్టీకి వ్యతిరేక పార్టీలో ఉన్నాను. కాబట్టి ఆ పార్టీ కంటూ కొన్ని నిబంధనలు, కట్టుబాట్లు ఉంటాయి. అందుకే దానికి అనుగుణంగానే మాట్లాడతాను విమర్శలు చేస్తాను తప్ప వ్యక్తిగతంగా ఆ ఫ్యామిలీతో నాకు ఎలాంటి గొడవలు లేవు అంటూ రోజా క్లారిటీ ఇచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: