తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకులలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. రామ్ గోపాల్ వర్మ , శివ మూవీ తో దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించాడు. ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో ఇటు నాగార్జున క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అలాగే రామ్ గోపాల్ వర్మ కి దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత వీరి కాంబోలో పలు సినిమాలు కూడా వచ్చాయి.

ఒకానొక సందర్భంలో రామ్ గోపాల్ వర్మ గురించి నాగార్జున కొన్ని ఆసక్తికరమైన విషయాలను వివరించాడు. నాగార్జున , రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ ... రామ్ గోపాల్ వర్మ ఒక రోజు నాకు సినిమా కథ చెప్పడానికి వచ్చాడు. ఇక అప్పుడు ఆయన తాగి ఉన్నాడు. తాగి ఉంటే పర్లేదు కానీ ఆయన కథ చెబుతున్నప్పుడు ఆ పక్కనే ఉన్న వస్తువులను చూపిస్తూ కథను చెప్పడం మొదలు పెట్టాడు. అలా ఆయన కథ చెబుతూ ఉంటే నాకు భయం వేసింది. దానితో నేను ఆయనను టేబుల్ కి ఒక వైపు కూర్చోమని , నేను మరొక వైపు కూర్చున్నాను.

ఎందుకు అంటే అలా ఆయన ఒక వైపు , నేను ఒక వైపు ఉండడం వల్ల నాకు పెద్దగా రిస్క్ ఉండదు అని ఆయనను మరో సైడ్ కూర్చోబెట్టాను అని నాగార్జున చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే నాగార్జున ఆఖరుగా నా సామి రంగ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం ఈయన కుబేర , కూలి సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నాడు. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: