తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న.. అడిగేముందు అసలు మన టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ ఉన్నారా అనే అనుమానం కూడా వస్తుంది. నెంబర్ వన్ హీరోయిన్ అనుకుంటున్నా వారి చేతిలో ఉన్నది ఒక్క సినిమానే.. నెంబర్ 2 అనుకుంటున్నాన వారందరూ ఇతర పరిశ్రమలకు వెళ్ళిపోతున్నారు. దీని కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ల కొరత పట్టిపీడిస్తుంది.

రోజుకో కొత్త ముద్దుగుమ్మ వస్తున్న టాలీవుడ్‌కు హీరోయిన్ల కొరత మాత్రం తీరట్లేదు. ఇక దాంతో దర్శక నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు నెంబర్ 1న్ అనుకున్న శ్రీలీలకు ఇప్పుడు అసలు సినిమాలు లేవు.. ఆమె చేతిలో ఉన్న పవన్- నితిన్ సినిమాలు  ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఆమెకే తెలియదు. మరొ ప‌క్క మృణాళ్ ఠాకూర్‌ కేవలం రెండుసినిమాల‌కే పరిమితం అయ్యారు తర్వాత సినిమాల మాట ఎత్తటం లేదు. ఈ ఇద్దరు విషయం ఇలా ఉంచితే మీనాక్షి చౌదరి దూకుడు బాగానే ఉన్నా స్టార్ హీరోలు ఆమెను పట్టించుకోవడం లేదు. మరో హీరోయిన్ పూజ హెగ్డే కు ప్రస్తుతం టాలీవుడ్ లో అసలు ఆఫర్స్ ఏ లేవు. మరో ముద్దుపమ్మ రష్మిక  టాలీవుడ్‌కు గుడ్ బాయ్ చెప్పి బాలీవుడ్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆమె ఒక పుష్ప2 లో మాత్రమే నటిస్తుంది.

సమంత తమన్నా రకుల్ ప్రీత్ సింగ్ లాంటి సీనియర్ హీరోయిన్స్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు కృతి శెట్టి, రాశి కన్నా వంటి వారు వరుస‌ అపజయాల్లో ఉన్నారు. ఇక ఈ గ్యాప్ ను భర్తీ చేయడానికి మరో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగులో వ‌రుస‌ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్ దేవర సినిమాతో మంచి హిట్ అందుకున్న జాన్వి.. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది. ఇలా టాలీవుడ్ నెక్ట్స్ నెంబర్ 1 హీరోయిన్ హోదా అందుకోడానికి రేసులో ఇప్పుడైతే ఎవరూ లేరు. కియారా అద్వానీ, జాన్వీ కపూర్ లాంటి బాలీవుడ్ బ్యూటీస్ ఒకట్రెండు సినిమాలతో వచ్చే గెస్టులే తప్ప ఇక్కడే ఉండరు. భాగ్య శ్రీ బోర్సే, మాళవిక మోహనన్ లాంటి అప్‌కమింగ్ హీరోయిన్లు సత్తా చూపిస్తే.. వాళ్లూ రేసులోకి వస్తారు. ఈ లెక్కన టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్ పీఠం మరికొన్నిరోజులు ఖాళీగా ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: