మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ దేవర బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికి నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్ను రాబట్టింది. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన దేవర మూవీ చూసిన వారందరికీ ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా స్టార్టింగ్ లో చెప్పిన యాతి ఎవరు, సముద్రంలో ఉన్న ఆస్తి పంజ‌రాలు ఎవరివి, అసలు దేవర నిజంగానే చనిపోయాడా,ఎక్క‌డికి వెళ్ళిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానాలు దేవర పార్ట్ 2 లో దొరుకుతాయని అనుకుంటున్నారు.

ఇక ఇదే క్రమంలో దేవర మరో బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ కు సంబంధించిన సీన్స్ కూడా షూట్ చేశారనే వార్త ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ఈ సినిమా మొత్తం చూసిన బాబు డీయోల్‌  సన్నివేశాలు ఎక్కడా కనిపించలేదు.. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో కూడా ఆయన పాత్ర గురించి ఎలాంటి ఎలివేట్ కూడా ఇవ్వలేదు. ఆయన సన్నివేశాలను కట్ చేశారని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ మూవీ స్టార్టింగ్ లో చెప్పిన యాతి క్యారెక్టర్ బాబి డియోల్ అని కూడా అంటున్నారు. ఇప్పటికే య‌నిమల్ సినిమాతో స్టైలిష్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న బాబి డియల్ దేవర 2 లో ఎలా భయపెట్టబోతున్నాడో చూడాలి.

ఇప్పటికే కోలీవుడ్ హీరో సూర్య కంగువలో  కూడా బాబీ డియోల్‌ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా నవంబర్లో ప్రేక్షకులు ముందుకు రానుంది. అలాగే పవన్ హరిహర వీరమల్లులో కూడా బాబి నటిస్తున్నాడు. వాటన్నిటికన్నా దేవరలో అనే బాబీ డీయోల్ క్యారెక్టర్ ఎంతో వైలెంట్ గా ఉంటుందని. కొరటాల కూడా ఆ పాత్రను ఎంతో ప్రత్యేకించి డిజైన్ చేశారని కూడా అంటున్నారు. ఇప్పటివరకు సైఫ్ అలీ ఖాన్ అక్కడే విలన్ గా దేవరలో కనిపించాడు. అతని పాత్రకు మించి బాబీ డియోల్ క్యారెక్టర్ ఉండబోతుందని టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: