యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమాతో బాక్సాఫీస్ పై తన దండయాత్ర మొదలుపెట్టి త్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియా బాక్సాఫీసుకు దడ పుట్టించాడు. ఇక ఇప్పుడు దేవరతో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ పై కొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన దేవర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో బంపర్ హిట్ అందుకుని అదిరిపోయే కలెక్షన్లు రాబడుతుంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తర్వాత సినిమాలపై పాన్ ఇండియా లెవెల్ లో అదిరిపోయే న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. దేవర హిట్ తర్వాత దర్శకుడు కొరటాల పార్ట్2 స్క్రిప్ట్ మీద ఇప్పటికే కసురత్తులు ప్రారంభించాడు


అలానే ఎన్టీఆర్ అటు వార్‌2 షూటింగ్ తో పాటు తన 31వ మూవీ ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు చేసుకుని డిసెంబర్లో షూటింగ్ కు వెళ్లబోతుంది. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ప్రశాంత్ ఎన్టీఆర్ సినిమా నుంచి ఒక క్లూ ఇచ్చాడు. ఈ సినిమాను తన గత సినిమాలకు భిన్నంగా పీరియాటిక్ డ్రామాగా తెర్కకించబోతున్నాడు. అలానే ఎన్టీఆర్ ను కూడా ఇప్పటివరకు ఎవరు చూడని లుక్ లో చూపించబోతున్నారట. అలాగే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది.

సినిమా స్టోరీ విషయానికి వస్తే బంగ్లాదేశ్ నేపథ్యంలో.. అక్కడ ఉండే తెలుగు వారికి అండగా ఎన్టీఆర్ పాత్ర ఉండబోతుందని సిని వర్గాల నుంచి వినిపిస్తున్న వార్త. ప్రశాంత్ నీల్‌ ఇప్పటివరకు కంటిన్యూగా నడిపిస్తున్న బొగ్గు .. బ్లాక్ కలర్ టోన్ నేపథ్యానికి సరికొత్తగా ఈ సినిమా ఉండబోతుందట. ఏది ఏమైనా ఎన్టీఆర్ - నీల్‌ కాంబినేషన్లో రాబోయే సినిమాపై అప్పుడే భారీ బజ్ క్రియేట్ అయింది. ఇక సినిమాపై వ‌స్తున్నా వార్తలు  మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: