ఈ మధ్య కాలంలో కన్నడ భామలకి తెలుగులో ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఎక్కువగా కర్ణాటక నుంచి వలస వచ్చినవారే అని అందరికీ తెలిసే ఉంటుంది. అనుష్క, పూజా హెగ్డే, రష్మిక లాంటి బ్యూటీస్ కన్నడ ప్రాంతం నుంచి వచ్చినవారే కావడం విశేషం. ‘కాంతారా’ ఫేమ్ సప్తమి గౌడ, ‘కేజీఎఫ్’ సిరీస్ తో సక్సెస్ అందుకున్న శ్రీనిధి శెట్టి ఇప్పటికే టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి విదితమే. ఇప్పుడు వీరి దారిలో మరో కన్నడ అందం రుక్మిణీ వసంత్ చేరిపోయిందని చెప్పుకోవచ్చు.

బ్యూటీ మొదటి చిత్రంతోనే ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ఛాన్స్ కొట్టేసినట్టు ప్రచారం నడుస్తోంది. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న ‘డ్రాగన్’ మూవీలో ఈ అమ్మడుకి ఛాన్స్ దక్కినట్టు సమాచారం. భారీ బడ్జెట్ తో మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే ‘డ్రాగన్’ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం ప్రశాంత్ నీల్ రుక్మిణీ వసంత్ ని ఫైనల్ చేసినట్లు గుసగుసలు వినబడుతున్నాయి.

మరోవైపు ఎన్‌టి‌ఆర్ కూడా ఆమె పట్ల కాస్త ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఇకపోతే కన్నడంలో రక్షిత్ శెట్టికి జోడీగా ‘సప్తసాగరాలు ధాటి’ అనే సినిమాతో రుక్మిణీ మంచి నటన కనబరిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. వాటిలో కన్నడ మూవీస్ రెండు కాగా తమిళంలో విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ సినిమాలలో రుక్మిణీ హీరోయిన్ గా చేస్తుండడం విశేషం. ఈ సినిమాలు లైన్ అప్ లో ఉండగానే ఏకంగా ఎన్టీఆర్ తో జోడీగా కన్ఫర్మ్ అయ్యిందనే వార్త తెరపైకి రావడంతో ఎన్‌టి‌ఆర్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఒకవేళ రుక్మిణీ ‘డ్రాగన్’ మూవీలో నటించడం ఖాయం అయితే మాత్రం ఆమెకిది టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ అవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: