ఎన్టీఆర్‌ 'దేవర’ విడుదలై నాలుగు రోజులు అవుతోంది. సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్లు మాత్రం అదిరిపోతున్నాయ్‌ అంటూ నిర్మాణ సంస్థ పోస్టర్‌ విడుదల చేస్తోంది. మూడు రోజులకు 304 కోట్లు వసూలు చేసినట్లు టీమ్‌ పోస్టర్‌ విడుదల చేసింది. అయితే ఈ వసూళ్లు నిజమేనా? లేక కావాలనే ఇలా చేస్తున్నారా? అని సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. నిజానికి టాలీవుడ్‌లో సినిమా చిన్నదైనా, పెద్దదైనా బావుంటే సెలబ్రిటీలు ,తన సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా ఆయా చిత్ర బృందాలకు అభినందనలు తెలియజేస్తుంటారు. చిరంజీవి, మహేష్‌, అల్లు అర్జున్‌ లాంటి హీరోల నుంచి రాజమౌళి వంటి అగ్రదర్శకుల వరకూ పోస్ట్ ద్వారా విష్‌ చేస్తుంటారు. కానీ దేవర విడుదలై వారాంతం ముగిసినా ఇంకా ఆ తరహా స్పందన రాలేదు. చిరంజీవి వంటి వారు ఐఫా వేడుక కోసం అబుదాబిలో ఉండి కుదరకపోవచ్చు. ఇతర హీరోలు షూటింగ్‌లతో బిజీగా ఉండొచ్చు. ఆ కారణంగా సినిమా చూడలేదనుకోవచ్చు. కానీ తారక్‌కు అత్యంత ఆప్తుడు అయిన రాజమౌళి తొలిరోజునే సినిమా చూశారు.

ఈ నేపథ్యంలో ద‌ర్శ‌కధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళికి జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర సినిమా న‌చ్చ‌లేదా? ఎందుకంటే.. నిన్న మీడియా వ‌ర్గాలు దేవ‌ర చూసారా స‌ర్.. ఎలా ఉంది అని రాజ‌మౌళిని అడ‌గ్గా.. ఆయ‌న స‌మాధానం చెప్పేందుకు నిరాక‌రించార‌ట‌. తార‌క్ అంటే రాజ‌మౌళికి ఎంతో ఇష్టం. తార‌క్‌తో ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు తీసారాయ‌న‌. అలాంటిది దేవ‌ర సినిమా గురించి ఆయ‌న కామెంట్ చేయ‌క‌పోవ‌డంపై.. ఆయ‌న‌కు సినిమా న‌చ్చ‌లేదేమో అనే టాక్ ప్ర‌చారంలో ఉంది.రాజ‌మౌళి తీసిన ఆర్ఆర్ఆర్ త‌ర్వాత తారక్ నుంచి రిలీజ్ అయిన సోలో సినిమా ఇది. 24 ఏళ్లుగా రాజ‌మౌళితో క‌లిసి పనిచేసే హీరోకి త‌ర్వాత సినిమా ఫ్లాప్ అవుతుంద‌నే సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్‌ను దేవ‌ర బ‌ద్ద‌లుకొట్టింద‌ని దేవ‌ర రిలీజ్ రోజే రాజ‌మౌళి కొడుకు కార్తికేయ స్పెష‌ల్ పోస్ట్ వేసి మ‌రీ చెప్పారు. మ‌రి రాజ‌మౌళి ఎందుకు దేవ‌ర గురించి స్పందించ‌లేదో ఆయ‌నే చెప్పాల్సి ఉంది.ఇదిలావుండగా దేవర ఎందుకో ఎన్టీఆర్‌ హార్డ్‌ కోర్‌ అభిమానులను ఆకట్టుకోలేకపోయిందని పబ్లిక్‌లో టాక్‌ నడుస్తోంది. దేవర రిలీజ్‌ ముందు వరకు టీమ్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పిన సెలబ్రిటీలు దేవర రిలీజ్‌ అనంతరం ఒక్కసారిగా మౌనం వహిస్తుంటే దేవర పూర్తిస్థాయిలో ఎవరినీ ఆకట్టుకోలేకపోయిందా అనే చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: