టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. తన నేచురల్ యాక్టింగ్, అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవల రాణాతో కలిసి విరాటపర్వం సినిమాలో నటించింది. నక్సల్స్ బ్యాక్ గ్రౌండ్ లవ్ స్టోరీతో సాయి పల్లవి ప్రేక్షకులను ఆకట్టుకుంది. విరాటపర్వంలో సాయి పల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2005లో వచ్చిన కస్తూరి మాన్ అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైంది ఈ బ్యూటీ.


ఆ సినిమాలో తన పాత్రకు పెద్దగా గుర్తింపు లేదు. అనంతరం 2015లో వచ్చిన ప్రేమమ్ అనే మలయాళం సినిమాతో సాయి పల్లవికి మంచి గుర్తింపు రావడమే కాకుండా సక్సెస్ కూడా అందుకుంది. ఆ సినిమా తర్వాత సాయి పల్లవికి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. తెలుగులో ఫిదా సినిమాతో ఎనలేని గుర్తింపు అందుకుంది. ఈ సినిమా అనంతరం సాయి పల్లవి ఒక్కో సినిమాకు రూ. 2 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. ఇదిలా ఉండగా.... సాయి పల్లవికి గతంలో చిరంజీవితో నటించే అవకాశం వచ్చిందని, కానీ ఆ ఆఫర్ రిజెక్ట్ చేసిందట.


ఈ విషయాన్ని స్వయంగా  ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు సాయి పల్లవి. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలు క్యారెక్టర్ లో నటించమని మొదటగా సాయి పల్లవిని సంపాదించారట. అయితే ఆ రోల్ తనకు నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసిందట. ఇక ఓ సందర్భంలో సాయి పల్లవి మెగాస్టార్ సినిమాలో నటించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించింది. తనకు రీమేక్ సినిమాల్లో నటించడం అస్సలు ఇంట్రెస్ట్ ఉండదని తెలిపింది.


ఆ కారణంగానే చిరంజీవి సినిమాలో నుంచి తప్పుకున్నట్లు తెలిపింది. దీంతో ఈ సినిమాలో కీర్తి సురేష్ ను ఆ పాత్ర కోసం ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక సాయి పల్లవి కెరీర్ విషయానికి వస్తే.... ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి తండేల్ సినిమాలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: