ఈ మధ్య కాలంలో అత్యంత వేగంగా సినిమాలను నిర్మిస్తున్న సంస్థలలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ చాలా ముందుంది. వీరు నిర్మించిన సినిమాలు వరుస పెట్టి థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. కానీ విజయాలను మాత్రం పెద్ద స్థాయిలో అందుకోవడం లేదు. కొన్ని రోజుల క్రితమే ఈ బ్యానర్ వారు నిర్మించిన మిస్టర్ బచ్చన్ అనే మూవీ థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ఈ బ్యానర్ వారు నిర్మించిన రెండు సినిమాలు కేవలం ఒక వారం గ్యాప్ తోనే థియేటర్లోకి రాబోతున్నాయి.

తాజాగా శ్రీ విష్ణు హీరోగా రీతూ వర్మ , మీరా జాస్మిన్ హీరోయిన్లుగా స్వాగ్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని అక్టోబర్ 4 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. గోపీచంద్ హీరోగా కావ్య దాపర్ హీరోయిన్గా శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని అక్టోబర్ 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ రెండు సినిమాలను నిర్మించింది కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారే. ఇక ఈ సినిమాల విడుదల తేదీల మధ్య కేవలం వారం రోజుల గ్యాప్ మాత్రమే ఉంది.

ముందు విడుదలైన స్వాగ్ మూవీ కి బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చినట్లయితే విశ్వం మూవీ కి ఇదే సినిమా పోటీ అయ్యే అవకాశం ఉంది. ఒక వేళ స్వాగ్ మూవీ కి యావరేజ్ స్టాక్ వచ్చిన కూడా ఆ సినిమా రెండో వారం ఏ మాత్రం ఇంపాక్ట్ చూపకపోవడానికి కూడా విశ్వం మూవీ కారణం అయ్యే అవకాశం ఉంది. ఇలా ఒకే బ్యానర్ సినిమాల ద్వారా రెండు సినిమాలకు పోటీ ఏర్పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pmf