యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ కె పాన్ ఇండియా లెవెల్లో భారీ పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ త్రిప్తి ద్రిమి. గతంలో ఎన్నో చిత్రాలు నటించిన రాని గుర్తింపు కేవలం ఈ ఒక్క సినిమాతో రావడంతో అన్ని ఇండస్ట్రీలలో ఈమె పేరు మారు మోగింది. దీంతో సినిమా అవకాశాలు, యాడ్స్, ఈవెంట్స్ అన్నీ కూడా ఈ ముద్దుగుమ్మ వద్దకు చేరాయి. అలా ఒకవైపు సినిమాలలో మరొకవైపు ఇలాంటి కమర్షియల్ యాడ్స్ వల్ల భారీగానే సంపాదిస్తోంది ఇటీవల జైపూర్ లో జరిగిన మహిళా వ్యాపారవేత్తలు ఈవెంట్ కి వస్తానని చెప్పి చివరి నిమిషంలో త్రిప్తి ద్రిమి వెళ్లలేక పోయిందట దీంతో ఒక్కసారిగా ఆ మహిళా వ్యాపారవేత్తలు ఫైర్ అయ్యారు.

దీంతో ఒక్కసారిగా ఈమె పైన పలు రకాల వివాదాలతో రచ్చ చేశారు. FICCI FLO అనే ఈవెంట్ కి త్రిప్తి ద్రిమి హాజరు కావాల్సి ఉండగా అందుకోసం ఈమె డబ్బును కూడా తీసుకున్నదట.. దీంతో మహిళ వ్యాపారవేత్తలు ఈమె ఫోటోలతో వేసిన బ్యానర్ పైన కొంతమంది మహిళలు సైతం బ్లాక్ పెయింటింగ్ వేస్తూ నాన్న రచ్చ చేస్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈవెంట్ కి వచ్చిన ఒక మహిళ వ్యాపారవేత్త మాట్లాడుతూ..త్రిప్తి ద్రిమి ఈవెంట్ కి వస్తానని తమ దగ్గర రూ.5.5 లక్షల రూపాయలు తీసుకున్నదని తెలిపింది.


ఈవెంట్ కి మొదలయ్యే ముందు ఆమె ఐదు నిమిషాలలో వస్తానని చెప్పి కానీ ఈవెంట్ కి హాజరు కాలేదని ఈమె బాధ్యత రహితంగా వ్యవహరించింది కాబట్టి.. తను రాలేనని మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు.. దీంతో మా టీం లీగల్ కూడా ఈమె పైన యాక్షన్ తీసుకుంటుంది అంటూ తెలిపింది. అలాగే జైపూర్ ప్రాంతంలో ఈమె చిత్రాలు కూడా బ్యాన్ చేస్తున్నామంటూ ఈమె అందరిని మోసం చేసింది అంటూ ఫైర్ అవుతున్నారు ఆ మహిళ వ్యాపారవేత్తలు. మరి ఈ విషయం పైన  త్రిప్తి ద్రిమి ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: