పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో కొంత కాలం క్రితం ఓజి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ స్టార్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య నిర్మిస్తూ ఉండగా ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలు అయిన తర్వాత కొంత కాలం పాటు ఫుల్ స్పీడ్ గా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతూ వచ్చింది. అలా షూటింగ్ జరిగిన సందర్భం లోనే ఈ మూవీ కి సంబంధించిన ఒక చిన్న వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు.

అది అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్క సారిగా పెరిగిపోయాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతున్న సమయంలో ఈ మూవీ ని 110 కోట్లకు రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను అమ్మివేయాలి అని మేకర్స్ అనుకున్నారట.

కానీ ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడం , ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు భారీ కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో దక్కుతుండడంతో ఏకంగా ఈ మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులకు ఈ మూవీ బృందం వారు 150 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు ఏ ధరకు అమ్ముడుపోతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: