నందమూరి బాలకృష్ణ ఆఖరు గా భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు . ఈ సినిమా తర్వాత బాలయ్య , బాబి దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు . ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతుంది . ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయం లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎన్నికల కోడ్ రావడంతో బాలయ్య అటు వైపు కొంత కాలం దృష్టి పెట్టాడు. దానితో కొంత కాలం పాటు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

ఇక ఎన్నికలు పూర్తి అయిన కొంత కాలానికే బాలయ్య మళ్ళీ ఈ మూవీ షూటింగ్ పై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతున్న ఇప్పటివరకు ఈ మూవీ టైటిల్ను కానీ , విడుదల తేదీని కానీ మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బాబి ఆఖరుగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాకు దర్శకత్వం వహించాడు.

మూవీ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక మరోసారి తాను తెరకెక్కిస్తున్న సినిమాని సంక్రాంతి బరిలో నిలపాలి అనే ఆలోచనలో ఈ దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. మరి వాల్టేరు వీరయ్య మూవీ తో బ్లాక్ బాస్టర్ ను విజయాన్ని సొంతం చేసుకున్న ఈ దర్శకుడు బాలయ్య మూవీ తో కూడా అదే రేంజ్ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: