జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రికార్డులు క్రియేట్ చేస్తుంది అని ఆశ పడ్డ ‘దేవర’ అంచనాలు చేరుకోలేక పోవడంతో ఆమూవీ కలక్షన్స్ వీకెండ్ తరువాత భారీగా పడిపోవడంతో ఈ మూవీ రికార్డులను క్రియేట్ చేయలేదని తారక్ అభిమానులకు అర్థం అయింది. దీనితో ప్రస్తుతం వారి ఆశలు అన్నీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ త్వరలో నటించబోతున్న ‘డ్రాగన్’ మూవీ పై ఉంది.



ఈమూ వీ టైటిల్ అనౌన్స్ మెంట్ నుండి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈమూవీకి సంబంధించిన కొన్ని ఆశక్తికర విషయాలు ప్రస్తుతం మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. ఈ మూవీలో హీరోయిన్ గా ‘సప్తసాగరాలు’ మూవీ ఫేమ్ రుక్మిణీ వసంత్ ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి.



వాస్తవానికి ఈమూవీలో తారక్ పక్కన హీరోయిన్ గా రష్మికను ఎంపిక చేసే ఆలోచనలు వచ్చినప్పటికీ ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉన్న రుక్మిణీ వసంత్ వైపు అడుగులు పడినట్లు సమాచారం సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలలో హీరోయిన్ కు చాల మంచి ప్రాధాన్యత ఉంటుంది. గ్లామర్ షోలు డ్యూయేట్స్ ప్రశాంత్ నీల్ సినిమాలలో కనిపించవు. అందువల్ల అలాంటి పాత్రకు రుక్మిణీ వసంత్ సరిపోతుందని ఈ మూవీ యూనిట్ సరిపోతుందని ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు టాక్.



ప్రస్తుతం తారక్ బాలీవుడ్ లో నటిస్తున్న ‘వార్ 2’ మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత ఈమూవీ షూటింగ్ తరువాత వరారంభం అవుతూమంది అని అంటున్నారు. బంగ్లాదేశ్ వార్ నేపద్యంలో అక్కడ చిక్కుకు పోయిన కొందరు భారతీయులను రక్షించే హీరో పాత్రలో జూనియర్ నటిస్తాడని  తెలుస్తోంది. 1971 ప్రాంతంలో జరిగిన బంగ్లాదేశ్ వార్ విషయాలు ఈనాటి తరానికి పెద్దగా తెలియవు కాబట్టి కొన్ని వాస్తవ సంఘటనలకు ఆధారంగా ఈ మూవీ కథను ప్రశాంత్ నీల్ చాల డిఫరెంట్ గా తన స్టైల్ లో ఈమూవీని తీయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: