ప్రస్తుతం నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు ఎనిమిదవ సీజన్ ని తెలుగు బుల్లితెరపై ఫాలో అవుతున్న ప్రేక్షకులు అందరూ కూడా ఒకే విషయం గురించి చర్చించుకుంటున్నారు. అదే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎవరు రాబోతున్నారు అని. అయితే గత సీజన్లో మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ఐదుగురుని హౌస్ లోకి పంపాడు నాగార్జున. కానీ ఈసారి మాత్రం ఏకంగా 10 మందిని హౌస్ లోకి పంపించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో గతంలో అలరించిన మాజీ కంటెస్టెంట్స్ ని మరోసారి హౌస్ లోకి పంపేందుకు నిర్ణయించారు అనేది తెలుస్తుంది.



 యాంకర్ రవి, హరితేజ, రోహిణి, ముక్కు అవినాష్, మహబూబ్ సహ మరి కొంత మందిని హౌస్ లోకి పంపడానికి బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేశారట. అయితే ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ విషయంలో వినిపిస్తున్న కొంతమంది మాజీ కంటెస్టెంట్స్ పేరు ఇక అభిమానుల్లో అంచనాలను పెంచేస్తూ ఉంటే.. ఇక కొన్ని పేర్లు మాత్రం అందర్నీ భయపెడుతూ ఉన్నాయి. అలాంటి పేర్లలో శోభాశెట్టి పేరు కూడా ఒకటి. ఆమె గత సీజన్లోనే మోస్ట్ ఇరిటేటింగ్ కాంటెస్టెంట్ గా పేరు సంపాదించుకుంది. ఇక ఆమె బిగ్బాస్ లో ఉన్న తీరు  కెరియర్ పై కూడా ప్రభావం చూపింది. హౌస్ నుంచి బయటకు వచ్చాక శోభ ప్రేక్షకులకు క్షమాపణలు కూడా చెప్పింది.


 ఆ తర్వాత మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ కూడా బిగ్బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ  ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక నిర్వాహకులు ఇలాంటి పనిచేశారు అంటే.. ఇక అంతంత మాత్రం ఉన్న రేటింగ్ పూర్తిగా పడిపోయే ఛాన్స్ ఉందనే ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే గంగవ్వకు ఫిజికల్ టాస్కులలో మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుంది.  హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఆమెపై సింపతి చూపుతూ పూర్తిస్థాయిలో గేమ్ ఆడలేరు. ఇక ఆమెను డామినేట్ చేసిన వ్యతిరేకంగా మాట్లాడిన బయట తీవ్ర స్థాయిలో నెగెటివిటీ కూడా వస్తుంది. అందుకే ఇక ఆమెను తీసుకువస్తే బిగ్బాస్ ఎనిమిదవ సీజన్ పూర్తిగా నాశనం అయినట్టేనంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు నిర్వాహకులు ఏం ప్లాన్ చేశారు అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: