టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న ఛ‌లో మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గీతగోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక ఈ సినిమా ఇచ్చిన విజయం ఏకంగా మహేష్ సినిమాలో నటించే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. అలా మహేష్ హీరోగా వచ్చిన  సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్గా నటించి మంచి విజయం అందుకుంది రష్మిక.

ఇక  టీలీవుడ్ స్టార్‌ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలో శ్రీవల్లిగా నటించి పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. ఇక ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉంది రష్మిక. ఇక ఈ సినిమా డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా బాలీవుడ్ లో కూడా వ‌రుస‌ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అల‌రిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈమే వ్యక్తిగత జీవితంపై ఎప్పటికప్పుడు వార్తల్లో హైలెట్ అవుతూనే వస్తుంది.

ఇక రష్మిక మొదటగా కన్నడ చిత్ర పరిశ్రమలి వచ్చిన కిరాక్ పార్టీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. అందులో హీరోగా నటించిన రక్ష‌త్‌ శెట్టితో ప్రేమలో పడింది. అంతేకాదు అతనితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని ఏడు అడుగులు వేయాలనుకుంది. అయితే అనుకోకుండా వీరిద్దరూ తమ ఎంగేజ్మెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో రకరకాల రూమర్లు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై రష్మిక తల్లి సుమన్ మందన్న‌ కూడా అప్పట్లో క్లారిటీ ఇచ్చారు.

సుమన్ మందన్న మాట్లాడుతూ.. ‘ఎంగేజ్మెంట్ తరువాత రష్మిక తెలుగులో నటించడం మొదలు పెట్టింది. ఇక రష్మిక  క్రేజ్ చూసి రక్షిత్ శెట్టి ఆమె సినిమా వ్యవహారాలు చూసుకోవడానికి ఒక మేనేజర్ ను నియమించాడు. అయితే అతడి ప్రవర్తన రష్మికకు నచ్చలేదు. దీంతో మేనేజర్ గా అతడిని తీసేసింది. ఈ విషయం నచ్చక రక్షిత్ - రష్మిక ఇద్దరూ గొడవపడ్డారు..ఇక తర్వాత కుటుంబ సభ్యులుగా మేము కలగజేసుకొని సామరస్యంగానే వీరిద్దరి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసాము’ అంటూ ఆమె తెలిపిందని సమాచారం  మొత్తానికి అయితే మేనేజర్ వల్లే రష్మిక - రక్షిత్ విడిపోయారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: