ప్రస్తుతం దేశవ్యాప్తంగా అక్కినేని నాగచైతన్య అలాగే సమంత విడాకుల అంశం హాట్ టాపిక్ అయింది.  తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ.. చేసిన కామెంట్స్ తో.. ఈ వివాదం రాజుకుంది. సమంతాను ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడారు  కొండా సురేఖ. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను  అడ్డుకోవాలంటే.. సమంతను తన వద్దకు కేటీఆర్ పంపించాలని.. నాగార్జున ముందు డిమాండ్ పెట్టినట్లు కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు.

అయితే దానికి సమంత ఒప్పుకోకపోవడంతో... అక్కినేని నాగచైతన్య అలాగే సమంత విడాకులు తీసుకున్నట్లు.. చెప్పుకొచ్చారు కొండా సురేఖ. అయితే కొండ సురేఖ చేసిన కామెంట్లపై... టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఏకమై స్పందిస్తోంది.  కొండా సురేఖను ఏకిపారేస్తూ జూనియర్ ఎన్టీఆర్ అలాగే నాని లాంటి సూపర్ స్టార్ హీరోలు స్పందిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఇంకా స్పందించలేదు.

 దీంతో సమంత ఫ్యాన్స్ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. ఒక టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ పైన  మహిళా మంత్రి కామెంట్స్ చేస్తే ఇంకా కూడా పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం దారుణమని... ఓ రేంజ్ లో పవన్ కళ్యాణ్ ను ఆడుకుంటున్నారు. హైడ్రా తీసుకువచ్చిన రేవంత్ రెడ్డిని మెచ్చుకున్న పవన్ కళ్యాణ్... టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక మహిళను కించపరుస్తూ మాట్లాడితే..  పవన్ కళ్యాణ్ నోరు మూగబోయిందా...? అంటూ నిప్పులు జరుగుతున్నారు.

 అటు అక్కినేని ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మండిపడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి, ముఖ్యంగా మహిళల విషయంలో పవన్ కళ్యాణ్ బాగా యాక్టివ్ గా రియాక్ట్ అవుతాడని... కానీ సమంత విషయంలో ఎందుకు స్పందించడం లేదని.. సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. ఇక ఇదే అదునుగా.. వైసిపి కూడా సందెట్లో సాడేమియాలాగా మధ్యలో ఎంటర్ అయింది. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతోంది. ఆడదానికి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ ఎక్కడ ? అంటూ ప్రశ్నిస్తోంది. మరి దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: