రెండు తెలుగు రాష్ట్రాల్లో సమంత, నాగా చైతన్య విషయంపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో.. టాలీవుడ్‌ హీరోయిన్‌ కు పెను ప్రమాదమే తప్పింది. టాలీవుడ్‌ హీరోయిన్ ప్రియాంక మోహన్.. ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. కాస్త అలర్ట్‌ గా లేకపోతే... టాలీవుడ్‌ హీరోయిన్ ప్రియాంక మోహన్..ప్రాణాలే దక్కేవి కాదు. ఈ సంఘటన తెలంగాణ లోని తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.  

తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం నేపథ్యంలో... ఏర్పాటు చేసిన స్టేజ్..కుప్పకూలింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సి రెడ్డికి తీవ్ర గాయాలు కావడం జరిగింది.  ఇక ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టాలీవుడ్‌ సినీనటి ప్రియాంక మోహన్ కి కూడా కొన్ని గాయాలు అయినట్లు సమాచారం.


అటు పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హానుమండ్ల ఝాన్సి రెడ్డి కూడా గాయాలు అయ్యాయి. టాలీవుడ్‌ సినీనటి ప్రియాంక మోహన్, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సి రెడ్డి స్టేజ్‌ పైన ఉన్నప్పుడే .... ఆ స్టేజ్‌ కుంగి..కుప్పకూలింది.  అయితే.... స్టేజి ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రమాదం నుంచి చాక చక్యంగా సినీనటి ప్రియాంక మోహన్ బయటపడట జరిగింది.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం. కాగా.. టాలీవుడ్‌ సినీనటి ప్రియాంక మోహన్ సరిపోదా శనివారం సినిమాలో మెరిసారు. ఈ సినిమా ఇటీవల రిలీజ్‌ అయి.. మంచి విజయాన్ని అందుకుంది. ఓటీటీలో కూడా అద్బుతంగా నడుస్తోంది. టాలీవుడ్‌ సినీనటి ప్రియాంక మోహన్ ఇప్పటికే నాని హీరోగా చేసిన గ్యాంగ్‌ లీడర్‌ సినిమా చేసి.. ఇప్పుడు  సరిపోదా శనివారం సినిమా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: