టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం హరిహర వీరమల్లు అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఈ మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇతర మూవీలపై ఫోకస్ పెట్టాడు. దానితో క్రిష్ కూడా కొండపొలం అనే మూవీ పై ఇంట్రెస్ట్ చూపించాడు. దానితో వీరిద్దరు కూడా హరిహర వీరమల్లు మూవీ.ని పక్కన పెట్టేసి వేరే సినిమాలపై కాన్సన్ట్రేషన్ పెట్టారు.

ఇక వారు కాన్సన్ట్రేషన్ పెట్టిన సినిమాలు పూర్తి అయిన తర్వాత మళ్లీ ఆ సినిమాను తిరిగి ప్రారంభించారు. కానీ ఆ తర్వాత పవన్ రాజకీయాల పనులతో బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఆగిపోయింది. ఇలా అనేక సార్లు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఆగిపోవడంతో ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అని అనుమానాలు కూడా జనాల్లో వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ చాలా డిలే అవుతూ ఉండడంతో ఈ మూవీ దర్శకత్వ బాధ్యతల నుండి క్రిష్ తప్పుకున్నాడు. దానితో కేవలం ఒకే ఒక సినిమా అనుభవం ఉన్న జ్యోతి కృష్ణ ఈ సినిమా యొక్క దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు.

ఈయన కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన రూల్స్ రంజన్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయం అందుకోలేదు. ఇక ప్రస్తుతం జ్యోతి కృష్ణ "హరిహర వీరమల్లు" సినిమాకు దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. మరి పవన్ ఈ దర్శకుడిని పూర్తిగా నమ్మినట్లు ఉన్నాడు. మరి ఈ దర్శకుడు పవన్ నమ్మకాన్ని ఏ స్థాయిలో నిలబెట్టుకుంటాడో , ఈ మూవీ తో ఎలాంటి విజయాన్ని పవన్ కళ్యాణ్ కు అందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: