కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో తలపతి విజయ్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఈయన ఈ మధ్య వరుస పెట్టి బ్లాక్ బస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటున్నాడు. విజయ్ ఇప్పటికే ఓ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈయన తన పూర్తి సమయాన్ని రాజకీయాల కోసం కేటాయించబోతున్నాడు.

ఇక రాజకీయాలకు పూర్తి సమయాన్ని కేటాయించే ముందు ఆఖరుగా ఈయన ఒక సినిమాను చేయబోతున్నాడు. ఆ సినిమా ఈయన కెరియర్లో 69 వ మూవీగా రూపొందబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. హెచ్ వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతుండగా ... పూజా హెగ్డే , మమతా బైజు , ప్రియమణిమూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేమిటి అంటే ఈ సినిమా బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా శ్రీ లీల కీలక పాత్రలో రూపొందిన భగవంత్ కేసరి మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో రీమిక్ సినిమాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు.

అలాంటి సమయంలో తన ఆఖరి మూవీ కోసం రీమిక్ మూవీ ని ఎందుకు విజయ్ ఎంచుకున్నాడా అని చాలా మంది జనాలు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి విజయ్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో రీమిక్ సినిమాలలో నటించి ఆ మూవీలలో చాలా మూవీల ద్వారా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. మరి ఈ సినిమా ఒక వేళ నిజంగా తలపతి 69 మూవీ రీమిక్ అయితే దానితో విజయ్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: