ఏంటి బొమ్మరిల్లు బ్యూటీ విడాకులు తీసుకోబోతుందా.. భర్త రితేష్ దేశ్ముఖ్ అంతా అయిపోయింది అని పెట్టిన బ్రేకప్ పోస్టులో నిజమెంతా... ఎందుకు ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ నటుడు అయినటువంటి రితేష్ దేశ్ ముఖ్ కి హిందీ సినిమాల్లో నటిస్తున్న సమయంలో జెనీలియా ఇష్టపడి ఇద్దరు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.  సౌత్ లో ఎన్నో సినిమాల్లో నటించిన జెనీలియాకి పేరు తెచ్చి పెట్టినవి బొమ్మరిల్లు, బాయ్స్,ఢీ, రెడీ వంటివి ఉన్నాయి. ఇక ఈ సినిమాల ద్వారా జెనీలియాకి ఎక్కడలేని క్రేజ్ రావడంతో సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఈ రింగుల జుట్టు రారాణి ఎంతో పాపులర్  హీరోయిన్ గా మారిపోయింది.ఇక సౌత్లో ఫేమస్ అవ్వగానే బాలీవుడ్ కి వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా కొన్ని సినిమాల్లో రాణించింది. ఆ టైంలో రితేష్ దేశముఖ్ తో ప్రేమలో పడి ఇద్దరు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

 సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ జంట కి సంబంధించి ప్రస్తుతం విడాకులు తీసుకుంటున్నారు అంటూ ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే రితేష్ దేశ్ ముఖ్ రాత్రి జెనీలియాకి బ్రేకప్ చెప్పేసారట. అయితే ఈ వార్తలు విన్న చాలా మంది జెనీలియా అభిమానులు నిజమే కావచ్చు అని అనుకుంటారు.అయితే ఇది నిజమే కానీ ఇప్పుడు కాదు వీరి పెళ్లి జరగకముందు.. ఇక అసలు విషయం ఏమిటంటే..జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ కి లేటుగా పడుకునే అలవాటు ఉందట. కానీ జెనీలియా మాత్రం తొందరగానే పడుకుంటుందట.

ఇక ఓ రోజు రితేష్ దేశ్ ముఖ్ రాత్రి ఒంటి గంటకి అంతా అయిపోయింది లెట్స్ బ్రేకప్ అంటూ ఒక పెద్ద మెసేజ్ చేశారట జెనీలియాకి. అయితే ఉదయాన్నే లేచిన జెనీలియా ఫోన్ చూసుకొని చాలా ఏడ్చిందట. ఇక ఆ తర్వాత కొద్దిసేపటికే రితేష్ దేశ్ ముఖ్ ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్ అంటూ కూల్ గా అడిగేసరికి రాత్రి అంత పెద్ద పని చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు ఫోన్ చేసావా అని రాత్రి జరిగిన విషయం మొత్తం చెప్పడంతో అయ్యో నేను అది ఊరికేనే పెట్టాను. జస్ట్ జోకింగ్ అంటూ నవ్వించారట. ఆరోజు రితేష్ దేశ్ ముఖ్ పెట్టిన పోస్ట్ కి జెనీలియా చాలా ఏడ్చిందట

మరింత సమాచారం తెలుసుకోండి: