* కొండా సురేఖపై ఏకమైన హీరోలు
* రేవంత్‌ సర్కార్‌ ను చీల్చిచెండాడుతూ పోస్టులు
* కేటీఆర్‌, కొండా పంచాయితీతో టాలీవుడ్‌ ఏకం
* సమంతను బజార్‌ లోకి లాగిన కాంగ్రెస్‌



గత రెండు రోజులుగా...టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటే రచ్చ. అక్కినేని కుటుంబం, సమంతపై తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ కామెంట్స్ చేయడం... కారణంగా ఏకమైంది టాలీవుడ్ ఇండస్ట్రీ. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తో... సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా వేదికగా ఏకీపారేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మండిపడ్డారు. ఎప్పుడు స్పందించని హీరోలు కూడా ఈసారి రియాక్ట్ కావడం... మొదటిసారి అని చాలా మంది చెబుతున్నారు.

 
అయితే ఇదే సమయంలో టాలీవుడ్ హీరోలు...అడ్డంగా బుక్కై దారుణమైన ట్రోలింగుకు...గురవుతున్నారు. దానికి కారణం...లేకపోలేదు.గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా అవమానాలు జరిగాయి. చీమను చూసినట్లు అప్పటి ప్రభుత్వం టాలీవుడ్ ఇండస్ట్రీ ని చూసింది. కానీ ఆ సమయంలో ఏ ఒక్క హీరో కూడా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడలేకపోయారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన అన్ని గొంతుకలు ఒకటై.. విలయ తాండవం చేస్తున్నాయి.

 
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలను ఏపీలో సరిగా ఆడకుండా కూడా చేసినట్లు అప్పట్లో  వార్తలు బాగానే వచ్చాయి. థియేటర్లు కూడా సరిగా ఇవ్వలేదట. ఇక కొత్త సినిమా రిలీజ్ అయితే.. టికెట్ ధరలు పెంచాలని జగన్మోహన్ రెడ్డిని టాలీవుడ్ హీరోలు... చాలా బతిలాడుకున్నారు. కానీ అప్పుడు మెగాస్టార్ చిరంజీవి లాంటి టాలీవుడ్ హీరోలకు అవమానమే జరిగింది. గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించిన రీతిలో జగన్ వ్యవహరించినట్లు వార్తలు వచ్చాయి.

 
కానీ ఆ సమయంలో టాలీవుడ్ ఏకమై జగన్మోహన్ రెడ్డి పై ఒక యుద్ధాన్ని ప్రకటిస్తే... టాలీవుడ్ పరిస్థితి ఇప్పుడు వేరుగా ఉండేది.  కానీ ఒక కుటుంబం కోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన పోరాటమే చేస్తుంది టాలీవుడ్. దీంతో టాలీవుడ్ హీరోలపై సోషల్ మీడియాలో.. నాన రచ్చ జరుగుతుంది. జగన్కు భయపడ్డ టాలీవుడ్ హీరోలు...ఇప్పుడు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని.. సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఎంతటి ముఖ్యమంత్రి వచ్చిన... కొండా సురేఖ విషయంలో స్పందించినట్లుగానే ముందు కూడా స్పందించాలని కోరుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: