* కొండా సురేఖ వ్యాఖ్యలతో టాలీవుడ్‌ తిరుగుబాటు
* ఏకమై రేవంత్‌ సర్కార్‌ ను ఏకిపారేసిన హీరోలు
* చంద్రబాబుతో టాలీవుడ్‌ పెద్దల చర్చలు
* హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లేందుకు ప్లాన్‌



దేశవ్యాప్తంగా తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఎవరు చూసినా కొండా సురేఖ అంశం గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు... నిజంగా అభ్యంతరకరం. ఆమెను అభిమానించే   కార్యకర్తలు కూడా ఇప్పుడు... నీచంగా చూస్తే పరిస్థితిఏర్పడింది. ఒక మహిళ మరొక మహిళను... కొండ సురేఖ తరహాలో అనడం దారుణం. అలాంటిది టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిన సమంత.. ను అనడం టాలీవుడ్ కి అవమానం.


అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి.. ఇలాంటి అవమానాలు.. చాలానే జరుగుతున్నాయి. ప్రస్తుత ఇన్సిడెంట్ తో.. టాలీవుడ్ ఏకమై... కొండా సురేఖను ఏగిపారేసాయి. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డులకు..  గద్దర్ పేరు పెట్టడం పట్ల కూడా టాలీవుడ్ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారట. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన.. అవార్డులకు అతనికి ఇలాంటి సంబంధం లేదని కొంత మంది వాదిస్తున్నారట.

అంతేకాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యల వల్ల టాలీవుడ్ ప్రముఖులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. అందరూ చర్చించుకుంటున్నారట.  మొన్న అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఇన్ కన్వెన్షన్ కూల్చివేత కూడా టాలీవుడ్ పెద్దలకు కోపం తెప్పించిందట. ఒక స్టార్ హీరో కుటుంబానికి సంబంధించిన కట్టడాలను... రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా కూల్చుతుందని మండిపడ్డారట. గతంలో కెసిఆర్.. పాలన బాగుండదని...  జగన్ కంటే అత్యంత దారుణంగా రేవంత్ రెడ్డి పాలన తయారైందని కొంతమంది అంటున్నారట.


ఇక ఈ కొండ సురేఖ ఎపిసోడ్ నేపథ్యంలో... టాలీవుడ్ పెద్దలందరూ చంద్రబాబును కలవబోతున్నారట. హైదరాబాదు నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీని ఏపీకి షిఫ్ట్ చేయాలని ఓ నిర్ణయానికి వచ్చారట. ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.  హైదరాబాద్ నుంచి ఏపీలోని వైజాగ్ లాంటి ప్రాంతానికి టాలీవుడ్ ఇండస్ట్రీ ని తరలించాలని అందరూ ఏకమై నిర్ణయం తీసుకున్నారట. అక్కడ చంద్రబాబునాయుడు  సర్కార్ ఉన్న నేపథ్యంలో... ఈ నిర్ణయానికి వచ్చారట.మొత్తానికి కొండా సురేఖ ఎఫెక్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: