అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన జుగుబ్సుకరమైన వ్యాఖ్యలు ఎంత సంచలనంగా మారా యో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అక్కినేని నాగార్జున మంత్రి కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేశారు.ఈ ఇష్యూ పై తెలుగు సినిమా ఇండస్ట్రీ విరుచుకుపడుతుంది.. స్టార్స్ అందరూ ఏకమై  దుర్మార్గపు మాటలని ఖండిస్తూ వస్తున్నారు..వ్యక్తిగత విషయాలను రాజకీయల కోసం వాడుకోవడం ఎంతో నీచమని ఎన్టీఆర్‌ కామెంట్‌ చేశారు. సురేఖ చేసిన చౌకబారు, నిరాధారమైన వ్యాఖ్యలను మహేశ్‌బాబు ఖండించారు.ఇలాంటి నిరాధరమైన మాటలు మాట్లాడటానికి మనసు ఎలా ఒప్పింది.. ఇలాంటి చర్యలను సినీ ఇండస్ట్రీ చూస్తూ ఊరుకోదు. ఎంత ప్రజాప్రతినిధులైన వారికీ ఒక హద్దు అంటూ ఉంటుంది.. సినిమా వాళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదు అని మెగాస్టార్ ఘాటుగా స్పందించారు.. సినీ పరిశ్రమ నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగా కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పారు.. కేటిఆర్ ను విమర్శించే తీరులో  మీ పేరు బయటకు వచ్చిందని నా వ్యాఖ్యలు వల్ల మీరు ఇబ్బంది పడి ఉంటే నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అని కొండా సురేఖ తెలిపారు.. 

అయితే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. కొండా సురేఖ గారు సమంత ని ఏమనలేదు ఆమెను పొగిడారు.. నాగార్జున కుటుంబం గురించి చాలా దారుణంగా మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసారు.. ఈ ఇష్యూ పై ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, నాచురల్ స్టార్‌ నాని, వరుణ్‌ తేజ్‌, నాగచైతన్య, చిన్మయి శ్రీపాద,అక్కినేని అఖిల్‌, కోన వెంకట్‌, విశ్వక్సేన్‌, మంచు మనోజ్‌, మంచు మనోజ్‌, మంచు లక్ష్మి, లావణ్య త్రిపాఠి, ఖుష్బూ, సుధీర్‌ బాబు, శ్రీకాంత్‌ ఓదెల, అక్కినేని అమల ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు ఘాటుగా స్పందించారు.. ఇప్పటి వరకు ఈ ఇష్యూ పై అందరూ స్టార్ హీరోలు స్పందించారు. ఒక్క నందమూరి బాలకృష్ణ తప్ప. ఇది తనకు సంబంధం లేదన్నట్టుగా ఆయన ఉన్నారు. నాగార్జునతో పాత గొడవలు దృష్టిలో పెట్టుకుని బాలయ్య మాట్లాడటం లేదని కొందరు విమర్శిస్తున్నారు.ఇలాంటి సమయంలో బాలయ్య మొండి పట్టు వీడాలి..ఇప్పటికైనా బాలయ్య మౌనం వీడి ఇండస్ట్రీ మహిళపైన ఓ మంత్రి చేసిన అసహస్యకరమైన వ్యాఖ్యలపై స్పందిస్తే బాగుంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: