ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఫాహధ్ ఫాజిల్ ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమాలో అనసూయ , సునీల్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు.

మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగంపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా యొక్క రెండవ భాగాన్ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ అప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన అనేక పనులు పెండింగ్ ఉండే అవకాశం ఉండడంతో ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీ నుండి డిసెంబర్ 6 వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. ఇక ఆగస్టు 15 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయాలి అనే నేపథ్యంలో ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది.

దానితో ఈ మధ్య కాలంలో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రచార చిత్రాలను విడుదల చేయడం లేదు. ఈ మూవీ నుండి ఒక ఐటెం సాంగ్ మరియు ట్రైలర్ మాత్రమే మేకర్స్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ నుండి ఐటెం సాంగ్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విన విడుదలకి చాలా తక్కువ రోజుల ముందు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసే ఆలోచనలు మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa