సాధారణం గా ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వీలైనంత వేగంగా రియాక్ట్ అయ్యే సామర్థ్యం కొంతమందికి మాత్రమే ఉంటుంది . అలా టాలీవుడ్ లో సమయాని కి అనుగుణంగా రియాక్ట్ అవుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిత్యం వార్తలో నిలుస్తూ వస్తున్నాడు. అటు విరాళాలు ఇవ్వటంలోనూ ఏదైనా విష‌యం పై రియాక్ట్ అవటం లోను ఎన్టీఆర్ ముందు వరుసలో నిలుస్తున్నాడు . ఇక వరద బాధితులకు సహాయం విషయంలో ఎన్టీఆర్ అందరికంటే ముందు స్పందించారు.. ఇప్పుడు సమంత పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్ల నేపథ్యంలోను ఆయనే ముందుగా స్పందించి ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు.

ఆయన స్పందించిన‌ తర్వాత టాలీవుడ్ మొత్తం ఒక తాటిపైకి వచ్చి అందరూ ఆ విషయంపై స్పందించారు. ఆయన స్పందించిన తీరుపై నెటిజ‌న్లు మెచ్చుకుంటున్నారు . ప్రస్తుతం దేవ‌ర విజయంతో ఫుల్ జోష్లో ఉన్నాడు ఎన్టీఆర్ . అధికార పార్టీ మంత్రికి వ్యతిరేకంగా కామెంట్లు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉన్నా తప్పు చేసిన వాళ్ల కోసం స్పందించకపోవడం ఇంకా పెద్ద తప్పు అని తారక్ భావించినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ సమయస్పూర్తితో వ్యవహరించడం ద్వారా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ బ్రేక్ ఈవెన్ సాధించిన నేపథ్యంలో తర్వాత ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది.

ఇది క్రమంలో తన తర్వాత సినిమాల లూక్స్ విషయంలో కూడా ఎన్టీఆర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక దేవర సక్సెస్ మీట్‌కు  పర్మిషన్ లేకపోవడంతో నిన్న రాత్రి హైదరాబాద్లో ఓ హోటల్లో చిత్ర పరిశ్రమలో ఉన్న పెద్దలకు దేవర యూనిట్ చిన్న పార్టీ ఇచ్చింది. దేవర సక్సెస్ తో టాలీవుడ్ కూడా ఎంతో మేలు జరిగింది . ఈ సినిమా రిలీజ్ తో తెలుగు రాష్ట్రాల్లోన థియేటర్లు కలకల్లాడుతున్నాయి. తర్వాత వచ్చే పాన్ ఇండియా సినిమాలకు కూడా మంచి ఊపునిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: