ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సుకుమార్,  బన్నీ కాంబో లో వచ్చిన    పుష్ప బ్లాక్ బస్టర్ కావడం తో పుష్ప 2 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.  నేషనల్ క్రష్ రష్మికా  మందన హీరోయిన్  గా నటించిన ఈ  భారీ బడ్జెక్ట్   పాన్ ఇండియా మూవీ   ఊహకందని స్థాయి లో విజయాన్ని అందుకుంది.  దీనితో పుష్ప ను మించేలా ఇప్పుడు పుష్ప  2 ప్లాన్ చేసారు  సుక్కు. అందులో భాగంగానే పుష్ప 2 కి సంబందించిన షూటింగ్ విషయం లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి పోస్టర్స్ , టీజర్ విడుదల చేసారు మేకర్స్.  ఇక ఈ చిత్రం పై ఉన్న అంచనాలకి తగట్టుగానే పోస్టర్ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.  అలాగే ఇప్పటికే దీని నుండి  రిలీజ్ చేసిన సాంగ్స్ సైతం సోషల్ మీడియా లో ట్రేండింగ్ లో  ఉన్నాయి.  


 ఇదిలా ఉంటే  మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెక్ట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కి సంబందించిన  లేటెస్ట్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అదేంటంటే .. ఇటీవల అల్లు అర్జున్  పుష్ప షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి తన భార్య పుట్టిన రోజు సందర్బంగా ఫామిలీ తో కలిసి  గోవా వెళ్లారు.  అక్కడే తన భార్య స్నేహ రెడ్డి  పుట్టిన రోజు వేడుకలను జరిపారు. అయితే సెలబ్రేషన్స్ పూర్తి చేసుకున్న అల్లు  అర్జున్  తాజాగా  హైదరాబాద్ కి చేరుకున్నారు.  ఇందులో భాగంగానే ఇప్పుడు   ఈ సినిమా క్లైమాక్స్  కోసం సుకుమార్ పెద్ద ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు నుండి పుష్ప 2 షూటింగ్ తిరిగి స్టార్ట్ చేస్తునట్టు గా తెలుస్తుంది.  ఇప్పటికే చాలా  సార్లు  ఈ చిత్రం యొక్క షూటింగ్ మధ్యలోనే ఆగిపోయంది.

 ఇలా అనేక సార్లు షూటింగ్ వాయిదా   తరువాత మళ్ళీ ఇప్పుడు సుక్కు,  బన్నీ ఇద్దరు షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు.   ఎట్టకేలకి నేటి నుండి పుష్ప 2 షూటింగ్  తిరిగి స్టార్ట్ అవుతుంది అన్న వార్త విని   బన్నీ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల పుష్ప 2  మేకర్స్ సైతం   ఈ సినిమా పై అప్డేట్ ఇచ్చారు.  పుష్ప 2 లో ఇంకా 2 సాంగ్స్  షూటింగ్   చేయాల్సి ఉంది అని  అన్నారు. ఈ షూటింగ్ మొత్తాన్ని ఈ నెలాఖరు వరకు పూర్తి అవుతుంది అని అన్నారు. మొత్తానికి పుష్ప అప్డేట్ రావడం తో దీని పై ఓ క్లారిటీ వచ్చింది.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: