ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ఈయన మిర్చి మూవీ వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగించాడు. ఆ తర్వాత బాహుబలి సిరీస్ మూవీలలో హీరోగా నటించాడు. ఇక బాహుబలి మొదటి భాగం , రెండవ భాగం అద్భుతమైన విజయాలను సాధించి భారీ కలెక్షన్లను వసూలు చేయడంతో ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక ఈ మధ్య కాలంలో ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలలో మాత్రమే నటిస్తూ వస్తున్నాడు. ఇక ప్రభాస్ ఇప్పటి వరకు నటించిన పాన్ ఇండియా సినిమాలు కూడా చాలానే బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం రాజమౌళి డాక్యుమెంటరీ సిరీస్ ఒకటి వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో చాలా రోజుల నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఇకపోతే రాజమౌళి డాక్యుమెంటరీ సిరీస్లో ఆయనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రభాస్ , రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ తెలియజేశారు. అందులో భాగంగా ప్రభాస్ ఆయనకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ప్రభాస్ ఆ డాక్యుమెంటరీ సిరీస్ లో భాగంగా మాట్లాడుతూ ... నేను నేను నటించిన సినిమా కనుక విడుదల అవుతుంది అంటే ఆ ముందు రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెడుతూ ఉంటాను.

ఒక వేళ సినిమా మంచి టాక్ వచ్చి బ్లాక్ బాస్టర్ అయ్యేలా ఉంటేనే తన స్నేహితులను ఫోన్ చేయమని , లేదంటే అస్సలు ఫోన్ చేయకు అని చెబుతాను అని తెలియజేశాడు. ఇకపోతే ప్రభాస్ కొంత కాలం కృతమే కల్కి 2898 AD అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: