సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన పాటలకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారు. సునీత మధురమైన గొంతుతో ప్రతి ఒక్కరిని మైమరపిస్తుంటుంది. స్వరంతోపాటు ఆమె రూపంతో కూడా ఎంతోమందిని ఫిదా చేస్తుంది. సునీత తొలిసారిగా 1995లో గులాబీ చిత్రంలో ఈ వేళలో నీవు అనే పాటతో పరిశ్రమలోకి గాయనీగా అరంగేట్రం చేసింది. శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, రెయిన్ బో, అనగనగా ఓ కుర్రాడు, ఓం నమో వెంకటేశాయ వంటి ఎన్నో చిత్రాలలో పాటలు పాడింది.


బెస్ట్ సింగర్ గా తొమ్మిది నంది అవార్డులను, రెండు ఫిలింఫేర్ అవార్డులను, సౌత్ అవార్డ్స్ లను అందుకుంది. 15 సంవత్సరాల వయసులోనే ఆల్ ఇండియా రేడియో నుండి జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. ఇలా తెలుగులో ఎన్నో పాటలు పాడి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. 19 ఏళ్ల వయసులోనే ఆమె వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఇక కొన్ని కారణాలవల్ల తన భర్తతో విడాకులు తీసుకుంది.


ఇటీవల బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేని అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇలా ఆమె రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఉన్నట్లుండి కేవలం నెల రోజులలోనే ఎంగేజ్మెంట్, వివాహం పూర్తి చేసుకుంది. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 2011 జనవరి 9న వీరి వివాహం శంషాబాద్ శివార్లలో ఉన్న రామాలయంలో జరిగింది. వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, సింగర్స్ ప్రతి ఒక్కరూ హాజరయ్యారు. వివాహం అయినప్పటి నుంచి సింగల్ సునీత ఎప్పుడూ ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు.


ఇక రీసెంట్ గా సింగర్ సునీత యూట్యూబర్ తో కలిసి ఫోటోలు దిగింది. దీంతో ఈ ఫోటోలు చూసిన తర్వాత రామ్ వీరపనేని కాస్త సీరియస్ అయ్యాడట. ఇలా ఫోటోలు దిగడం ఏంటి అని ప్రశ్నించారట. ఈ విషయంలో వారిద్దరి మధ్య పెద్ద వివాదం జరిగినట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: