డైరెక్టర్ తేజ అంటే అప్పట్లో ఎంతో మంది అభిమానించేవారు. ఎందుకంటే  ఈయన తీసే సినిమాలు అలా ఉండేవి మరి. ఒకప్పుడు జయం,చిత్రం,ఫ్యామిలీ సర్కస్, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా,జై,లక్ష్మీ కళ్యాణం, ధైర్యం,సంబరం, నిజం వంటి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ఎన్నో అవార్డులను అందుకున్నారు.ముఖ్యంగా ఈయన తీసిన జయం, నిజం,  జై,చిత్రం సినిమాలు ఎప్పటికీ ఎవరి గ్రీనే.. అయితే అలాంటి ఈ మంచి డైరెక్టర్ పై ఇప్పటికే హీరోయిన్ రాశి షాకింగ్ కామెంట్లు చేసింది. నిజం సినిమాకి స్టోరీ ఒకలా చెప్పి చూపించడం నెగటివ్ గా చూపించారు. ఆ సినిమా వల్ల నా కెరీర్ మొత్తం నాశనమైంది. అంటూ ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది.ఇక రాశి లాగే మరో హీరోయిన్ కూడా తన బాధ వెల్లగక్కింది. అంతేకాదు ఆ హీరోయిన్ అభిమానులు ఏకంగా తేజ ఇంటికి వెళ్లి మరీ దాడి చేశారట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే మణిచందన..

 రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అయినటువంటి దేవర సినిమాలో జాన్వి కపూర్ తల్లిగా నటించింది.అలాగే రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో కూడా విలన్ పాత్రలో చేసిన జగపతిబాబు భార్యగా నటించింది. అయితే అలాంటి మణి చందన ఒకప్పుడు రవితేజ పక్కన హీరోయిన్గా చేసింది. ఇక ఈమెను తెలుగులో ఆరాధించకపోయినప్పటికీ తమిళంలో మాత్రం ఈమెను చాలా బాగా ఆదరించారు.. కొంతమంది అయితే ఈమెను జూనియర్ కుష్బూ అంటూ నెత్తిమీద పెట్టుకున్నారు. అయితే అలాంటి ఈ హీరోయిన్ దేవర సినిమా హిట్ అవ్వడంతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ అయిపోతుంది.అయితే రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

నేను నిజం సినిమాలో ఒక చాకలి మహిళ పాత్రలో నటించాను. అయితే ఈ సినిమాలో నాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలతో పాటు ఒక పాటను కూడా డైరెక్టర్ తేజ తొలగించారు. కానీ నేను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఆ విషయం తెలుసుకొని నా అభిమానులు అందరూ డైరెక్టర్ తేజ ఇంటికి వెళ్లి మరీ దాడి చేశారు. దాంతో రాజీ పడిన డైరెక్టర్ తేజ ఆ సినిమాలో నా సన్నివేశాలను అలాగే పాటను మళ్లీ పెట్టారు.దాంతో నా అభిమానులకు డైరెక్టర్ తేజకు మధ్య ఉన్న గొడవ సర్దుమరిగింది.. అంటూ ఒక షాకింగ్ విషయాన్ని నటి మణి చందన బయటపెట్టింది.దీంతో ఈ విషయం తెలిసిన చాలా మందిని నెటిజన్స్ తల్లిపాత్రలో చేసే మణి చందన కి ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందా అంటూ నోరెళ్లబెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: