- వేణు స్వామి త‌ల్లి విజ‌య ల‌క్ష్మి మృతి
- ప‌లువురు సెల‌బ్రిటీ ల సంతాపం

- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం ఏ మాత్రం అవ‌స‌రం లేదు . వేణుస్వామి ఎప్ప‌టి క‌ప్పుడు జాత‌కాలు చెపుతూ.. ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేస్తూ హైలెట్ అవుతుంటాడు. ఇక ప్రముఖుల జీవితా ల గురించి వేణుస్వామి చెప్పిన విషయాలు కొన్ని నిజం కావ‌డం.. ఆ త‌ర్వాత వేణు స్వామి హైలెట్ కావ‌డం.. మ‌రి కొన్ని విష‌యాల పై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.


ఇక ఇటీవ‌ల నాగ‌చైత‌న్య - శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జ‌రిగిన‌ప్పుడు వేణు స్వామి జాత‌కం చెప్ప‌డం.. వారిద్ద‌రు కూడా విడిపోతార‌ని చెప్ప‌డం.. ఆ త‌ర్వాత వేణు స్వామిపై తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం కావ‌డం జ‌రిగాయి. ఇప్పుడు ఆయన వ్యక్తిగత ... జీవితం లో ఓ విషాదం కూడా చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే వేణు స్వామికి జన్మనిచ్చిన తల్లి, శ్రీమతి పరాంకుశం విజయ లక్ష్మి ఈ రోజు మృతి చెందారు. ఈ రోజు ఉద‌యం అన‌గా అక్టోబ‌ర్ 4న ఆమె తుది శ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని వేణు స్వామి త‌న సోష‌ల్ మీడియా ఖాతా ద్వారా చెప్పారు.


వేణు స్వామి త‌న సోష‌ల్ మీడియా ఖాతా లో మా అమ్మ గారు శ్రీమతి పరాంకుశం విజయ లక్ష్మి గారు ఈరోజు ఉదయం పరమపదించారు అన్న విష‌యాన్ని ఆయ‌న సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే తన తల్లి ఫోటోని ఆయన షేర్ చేశారు. ఇక వేణు స్వామి త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి మృతి చెందిన విష‌యం చెప్ప‌డం తో ప‌లువురు సెల‌బ్రిటీ లు ... సినిమా వాళ్లు ఆయ‌న‌కు త‌మ ప్ర‌గాడ సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: