టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్రను విషాదం.. నెలకొనడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్, నట కిరీటి రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకోవడం జరిగింది. నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి మరణించారు. 38 సంవత్సరాలు ఉన్న గాయత్రి.. శుక్రవారం రోజున గుండెపోటుతో... ఆసుపత్రి పాలయ్యారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆమె కింద పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.

 

హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి గాయత్రిని తరలించి... మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యులు. అయితే రాజేంద్రప్రసాద్ కూతురి పట్ల విధి.. వెక్కిరించింది. శనివారం ఉదయం పూట ఆమె మరణించింది. ఆస్పత్రిలో ఉన్నప్పుడే మరోసారి గుండెపోటు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే గాయత్రి మరణించిందట. అయితే ఈ విషయం..స్వయంగా నటుడు రాజేంద్రప్రసాద్ ప్రకటించారు.

 

అనంతరం గాయత్రి మృతదేహాన్ని రాజేంద్రప్రసాద్ ఇంటికి తీసుకువచ్చారు. ఇది ఇలా ఉండగా...ఆయన కూతురు మరణించిన నేపథ్యంలో...నటుడు రాజేంద్రప్రసాద్ కు సంబంధించిన ఒక... వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. తన కూతురు గాయత్రి... తనకి ఇష్టం లేని వివాహం చేస్తుందని నటుడు రాజేంద్రప్రసాద్.. గతంలో ఓ సినిమా ఈవెంట్లో తెలిపారు. బేవర్స్ అనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో తన కూతురు గురించి ఈ వ్యాఖ్యలు చేశారు.

 

తల్లి అంటే ఎంతో ప్రేమ అని.. కానీ ఆమె నా 10 సంవత్సరాల వయసులోనే మరణించింది అని రాజేంద్రప్రసాద్ పేర్కొనడం జరిగింది. దీంతో తన తల్లి పేరు కూతురుకు పెట్టినట్లు వివరించారు.తన అమ్మను... నా కూతురులో చూసుకున్నానని వెల్లడించారు రాజేంద్రప్రసాద్. కానీ తన కూతురు... ప్రేమ వివాహం చేసుకొని నాకు దూరంగా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. కానీ ఆమె పాడే పాట తన తల్లిని గుర్తు చేస్తుందని... దానికోసం మళ్లీ తన కూతుర్ని ఇంటికి తీసుకువచ్చానని.. రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. అలా రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: