టాలీవుడ్ ఇండస్ట్రీలో నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును వివాహం చేసుకున్న అనంతరం నమ్రత శిరోద్కర్ నటనకు గుడ్ బాయ్ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా హిందీకి చిత్రాలలో నటించి నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా ఎంతో మంచి పేరును సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నమ్రత శిరోద్కర్ ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  

1994-95 సీజ‌న్ లో నమ్రత తనకు చాలా బోల్డ్ పాత్రలు ఆఫర్ చేసినప్పటికీ వాట‌న్నిటినీ తిరస్కరించినట్లు వెల్లడించింది. ఇలాంటివి చేయడం నాకు సౌకర్యంగా ఉండదు. నేను తెరపై ముద్దులు పెట్టుకోను.. ప్రేమించను.. నేను నిరాశలో లేను.. సర్వశక్తిమంతురాలైన తాను.. సురక్షితమైన నేపథ్యం నుండి వచ్చాను అంటూ తెలియజేసింది. నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ, అవన్నీ నేను వద్దనుకున్నాను. కేవలం నేను పని చేసే ప్రాజెక్టులో నా నటన సామర్థ్యానికి వెలికితీయడానికి కృషి చేస్తాను అని అన్నారు. అంతేకాకుండా., సంవత్సరానికి కేవలం ఒక సినిమా మాత్రమే తీస్తానని ఆమె తెలియజేశారు. నా కెరియర్ గ్రాఫ్ కానీ మీరు చూస్తే నేను సంవత్సరానికి రెండు సినిమాలకు మించి చేయలేదు అంటూ ఆమె చెప్పుకొని వచ్చారు. ఇక అలాగే నమ్రతా మహేష్ వివాహ అనంతరం మహేష్ బాబు తన నటన జీవితంలో కష్టపడి పనిచేస్తుండగా మాజీ మిస్ ఇండియా అయిన నమ్రత మాత్రం కెరియర్ ను  విడిచిపెట్టి గృహిణిగా తన జీవితాన్ని కొనసాగించింది.

ప్రముఖ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ.. తన భర్త మహేష్ బాబుతో తనకున్న సంబంధాన్ని వివరిస్తూ పెళ్లి తర్వాత నటనను ఎందుకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందో వివరించింది. నమ్రతాను వివాహం చేసుకునేవాడు పని చేయని భార్య కావాలని స్పష్టం చేశారని.. అందుకే పెళ్లికి ముందే తనకు ఉన్న సినిమా ప్రాజెక్ట్ లు అన్నీ పూర్తి చేశానని నమ్రత పేర్కొన్నారు. మేము ఇద్దరము ఒకరికొకరు చర్చించుకొని కొన్ని విషయాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.  కొన్ని రోజులు నేను కూడా ముంబైలో ఒక అపార్ట్మెంట్ తీసుకొని నివాసం ఉండడం, ఆ సమయంలో మహేష్ కూడా అక్కడికి వచ్చేవారు అంటూ తెలిపారు. అక్కడ ఒంటరిగా ఉండడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉండేది కనుక ముంబై హైదరాబాద్లో కూడా అపార్ట్మెంట్లో ఉండాలని నిర్ణయం తీసుకొని రెండు చోట్ల అపార్ట్మెంట్స్ ను తీసుకున్నామంటూ తెలిపారు. అలాగే మేము ఇద్దరము వివాహం చేసుకోవాలని నిర్ణయం కూడా మా జీవితంలో ఉత్తమమైన మూమెంట్ అని నమ్రత అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: