నాగార్జున ప్రస్తుతం వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నుంచి ప్రారంభమైన ఈ రగడ తాజాగా ఆయనపై కేసు నమోదు వరకు వెళ్ళింది. హైటెక్ సిటీ సమీపంలోని తమ్ముడి కుంటను కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించి కబ్జాలకు పాల్పడి లాభాలు అర్జించారని ఆయనపై వెంటనే క్రిమినల్ చర్యలు నమోదు చేయాలంటూ జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఇప్పటికే చెరువును కబ్జా చేసినట్టు ఇరిగేషన్ అధికారులు ధ్రువీకరించిన ఆధారాల తో ఆయన లిఖితపూర్వకంగా తన కంప్లైంట్ రాసుకోచ్చాడు. ఇప్పటికే మాదాపూర్ పోలీసులు ఆ కంప్లైంట్ కూడా తీసుకుని లీగల్ ఒపీనియన్ కు పంపారు.


తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్‌ కన్వెన్షన్ కట్టారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. కాగా దాని పై హైడ్రా కు మరోసారి ఫిర్యాదులు అందాయి . ఈ ఫిర్యాదులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చెరువు ఆక్రమణకు గురైనట్టు నిర్ధారించి.. కూల్చివేతల కు ఆదేశాలు ఇచ్చారు. భారీ పోలీసుల‌ బందోబస్తు మధ్య .. జంబో జేసీబీలతో ఎన్ కన్వెన్షన్ను గంటల వ్యవథిలోనే అధికారులు కూల్చివేశారు. కాగా దీని పై నాగార్జున స్పందిస్తూ.. ఆ భూమి పట్టా భూమి అని.. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు ..


ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిదని.. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసినట్లు నాగార్జున తెలిపారు . తాజాగా ఇప్పుడు మరోసారి నాగ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కసిరెడ్డి భాస్కరరెడ్డి . మరి దీని పై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడలి . మరోవైపు మంత్రి కొండా సురేఖ సమంత , అక్కినేని ఫ్యామిలీ పై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దాంతో కొండా సురేఖ పై నాగ్ లీగల్ యాక్షన్ కు సిద్ధమయ్యారు. ఇలా నాగార్జునకు ఊహించని విధంగా రేవంత్ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో నాగార్జునను అరెస్టు చస్తారని అనుమానాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: