సమంత గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించి తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే పెద్దింటికి కోడలు అయ్యింది. తాను నటించిన మొదటి సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది సమంత. కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2017 అక్టోబర్ నెలలో వివాహం చేసుకున్నారు. కేవలం నాలుగు సంవత్సరాల పాటు కలిసున్న ఈ జంట 2022 అక్టోబర్ నెలలో విడాకులు తీసుకున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో సినీ పరిశ్రమ, వారి అభిమానులు ఆందోళనకు గురయ్యారు.


ఇక విడాకులు తర్వాత సమంత మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధిని ఎదుర్కొంది. ఆ సమయంలో సమంత సానుభూతి కోసం ఇదంతా నాటకం ఆడుతున్నట్టు చాలామంది ట్రోల్ చేశారు. కానీ సమంత వాటిని పట్టించుకోకుండా ఆ వ్యాధికి చికిత్స తీసుకొని పూర్తిగా కోలుకుంది. ఆ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత సమంత మళ్ళీ సినిమాల్లో నటించడం ప్రారంభించింది. విడాకుల అనంతరం సమంత పుష్ప సినిమాలో ఊ అంటావా మావా అనే ఐటమ్ సాంగ్ చేసింది.


ఈ పాట అప్పట్లో పెద్ద సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. అలాంటి పాటలో సమంత నటించడం పెద్ద సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా... ఈ ఏడాది అక్టోబర్ నెలలో మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై వాక్యాలు చేస్తూ సమంత, అక్కినేని కుటుంబాన్ని బయటకు లాగింది. సమంత విడాకులు తీసుకున్నప్పటినుంచి నిత్యం ఆమెను ఏదో ఒక వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.


కానీ సమంత వాటిని ఏమీ పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగుతోంది. సమంత ధైర్య సాహసాలను చూసి అభిమానులు సంబరపడిపోతారు. కానీ సమంత కు బ్యాడ్ లక్ ఎప్పుడు వెంటే ఉంటుందని, అంతేకాకుండా అక్టోబర్ నెలలో సమంతను ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంటుందని ఆమె అభిమానులు సానుభూతిని ప్రకటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: