ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ షోని ఫాలో అవుతున్న బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా అన్ని వారాలలో భారీ ఓట్లు సాధిస్తూ సేవ్ అవుతూ వస్తున్న మణికంఠ తీరు అస్సలు అర్థం కావట్లేదు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచి సింపతి కార్డు వాడటం మొదలుపెట్టాడు మణికంఠ. ఏకంగా హౌస్ లోకి వెళ్ళిన నెక్స్ట్ డేనే తన లైఫ్ లో ఉన్న బాధలన్నింటినీ కూడా చెప్పేశాడు. ఇలా చెప్పడం వల్ల బయట ఉన్న ప్రేక్షకులు తనకు మద్దతుగా నిలుస్తారు అనుకున్నాడో లేదంటే ఇంకేం ప్లాన్ వేసాడో కానీ ఇక అందరినీ ఏడిపించేసాడు.


 అయితే మనికంఠ ఎప్పుడు ఎలా ఉంటాడో అన్న విషయం కూడా అటు ప్రతిరోజు షో ఫాలో అవుతున్న ప్రేక్షకులకు సైతం అర్థం కావట్లేదు. ఆ రేంజ్ లో అందరిని కన్ఫ్యూషన్ లో పడేస్తూ ఉన్నాడు. ఏకంగా తన భార్య తనకు దూరమైందని తన కూతురు తనకు దూరమైందనే బిగ్ బాస్ లో రాణిస్తేనే వాళ్ళు నాకు దగ్గరవుతారని అంటూ ఎన్నోసార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇటీవల ఏకంగా మణికంఠకు తన భార్య నుంచి ఒక ఆహారంతో పాటు మంచి స్వీట్ మెసేజ్ కూడా వచ్చింది. దీంతో భార్య దూరమైంది అంటూ మణికంఠ చెప్పింది నిజమా కాదా అనే విషయంపై కూడా అందరూ కన్ఫ్యూజన్లో పడిపోయారు.


 అయితే సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో ఎవరైనా కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తూ ఉంటే ప్లీజ్ బిగ్ బాస్ నన్ను ఎలిమినేట్ చేయకండి. నేను ఇంకా బాగా ఆడతాను అని రిక్వెస్ట్ చేసుకోవడం చూస్తూ ఉంటాం. కానీ నాగమణికంఠ మాత్రం బాగా ఏడ్చి నేను హౌస్ నుంచి వెళ్ళిపోతాను సార్.  నన్ను ఎలిమినేట్ చేయండి అంటూ బిగ్ బాస్ ని బతిమిలాడట. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మణికంఠ ఇలా బతిమిలాడింది నాగార్జున క్లాస్ పీకినందుకా.. లేకపోతే అతని భార్య పంపిన మెసేజ్ ను చూపించడం వల్ల ఇలాంటి మాటలు మాట్లాడాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇక ఇలాంటి గేమ్ ప్లాన్ అతనిపై ఆడియన్స్ లో సింపతి అంతకంతకు పెరిగేలా చేస్తుంది అని చెప్పాలీ.

మరింత సమాచారం తెలుసుకోండి: