టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో సుజిత్ ఒకరు. ఈయన శర్వానంద్ హీరోగా రూపొందిన రన్ రాజా రన్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఇకపోతే ఈయన మొదటి సినిమా చేసిన సమయంలో చాలా తక్కువ వయసు కలిగిన వ్యక్తి. ఈయన దర్శకత్వం వహించిన మొదటి మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ఈయన చాలా తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహిస్తాడు. చాలా తక్కువ టైమ్ లోనే అద్భుతమైన స్థాయికి ఎదుగుతాడు అని చాలా మంది అనుకున్నారు.

ఇక ఈయన మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు కానీ ఎక్కువ సినిమాలు మాత్రం చేయలేదు. రన్ రాజా రన్ సినిమా తర్వాత ఈయన ప్రభాస్ హీరోగా సా అనే మూవీ ని మొదలు పెట్టాడు ఇది. మూవీ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాకు ఎక్కువ సమయం పట్టింది. ఈ మూవీ విడుదల అయిన తర్వాత కూడా సుజిత్ వెంటనే మరో మూవీ ని మొదలు పెట్టలేదు. చాలా కాలం గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్ హీరోగా ఓజి అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఇక ఈ సినిమా కూడా త్వరగా పూర్తి కావడం లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయ పనులతో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ షూటింగ్ కొంత భాగం పూర్తి అయ్యి ఆగిపోయింది.

మళ్లీ మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా రన్ రాజా రన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సుజిత్ ఆ తర్వాత మాత్రం ప్రభాస్ సినిమా కోసం కొంత సమయాన్ని , ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా కోసం మరి కొంత సమయాన్ని తీసుకున్నాడు. దానితో ఈయన కెరియర్ మొదలు పెట్టి చాలా కాలమే అవుతున్న కేవలం రెండు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించాడుఎం కాకపోతే ఈయన దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: