ఫ్రాన్స్ లో ఒక వ్యక్తి తన భార్య కు మత్తు మందు ఇచ్చి అనేక మంది తో హత్యాచారం చేయించిన ఘటన ప్రస్తుతం ఫ్రాన్స్ లో సంచలనం రేపిన విషయం మన అందరికీ తెలిసిందే . ఇక అసలు ఈ కేసులో ఏం జరిగింది అనే విషయాలను కి వెళితే ... ప్రాన్స్ లోని ఓ ప్రభుత్వ రంగ సంస్థ లో పని చేస్తున్న 71 సంవత్సరాల నిందితుడు తన భార్యపై కొన్నాళ్ల పాటు అత్యంత కఠినం గా వ్యవహరిస్తూ వస్తున్నాడు . రాత్రి పూట ఆమె తినే భోజనంలో రహస్యం గా డ్రగ్స్ ను కలిపి తినిపిస్తూ ఉండేవాడు . ఆమె డ్రస్ కలిపిన భోజనాన్ని తిన్న తర్వాత మత్తులోకి జారుకోగానే కొంత మంది వ్యక్తుల్ని ఇంటికి రప్పించేవాడు.

ఆ తరువాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతుంటే వాటిని రహస్య కెమెరాల ద్వారా రికార్డ్ చేసుకునేవాడు. ఈ సంఘటనలు చాలా సంవత్సరాల పాటే జరిగాయి. ఇకపోతే కొంత కాలం క్రితం ఓ షాపింగ్ మాల్ లో నిందితుడు కొందరు మహిళలను రహస్యంగా వీడియో తీస్తుండగా పట్టుబడ్డాడు. అనంతరం అతడి ఫోన్ చెక్ చేయగా అందులో తన భార్యపై నిందితుడు చేసిన సంఘటనలు వెలుగు చూశాయి.

దాదాపు 72 మంది తో 92 సార్లు తన భార్యపై హత్యాచారం చేయించినట్లు దర్యాప్తులో తేలింది. ఇకపోతే ప్రస్తుతం ఈ కేస్ కి సంబంధించిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి సంచలన నిర్ణయం వెల్లడించాడు. తాజాగా ఈ కేస్ విషయంలో న్యాయమూర్తి వీడియో ఆధారాలు ప్రదర్శిస్తున్నప్పుడు కోర్టులో ఉన్న సాధారణ పౌరులు కూడా వాటిని చూడవచ్చు అని ఆయన వెల్లడించారు. కాకపోతే ఆ సమయంలో సున్నితమైన మనస్సు ఉన్నవారు , మైనర్లు కోర్టు పరిసరాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలి అని న్యాయమూర్తి ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: