టాలీవుడ్ స్టార్ హీరో లు అంతా ఇప్పుడు దాదాపుగా పాన్ ఇండియా సినిమాల్లో నే నటిస్తూ వస్తున్నారు . ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు గా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో ఒకరు అయినటు వంటి ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాల్లో మాత్రమే నటిస్తూ వస్తున్నాడు . అలాగే అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ కూడా వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాల్లో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు . ఇకపోతే మహేష్ బాబు మరికొన్ని రోజుల్లోనే రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు.

మూవీ ని పాన్ ఇండియా స్థాయికి మించిన రేంజ్ లో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా  పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ , ఓజి అనే మూడు మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో హరిహర వీరమల్లు , ఓజి సినిమాలు పాన్ ఇండియా మూవీలుగా రూపొందుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మాత్రం పాన్ ఇండియా మూవీ గా రూపొందడం లేదు.

మూవీ కి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి హరీష్ శంకర్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తే బాగుండేదేమో అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇది ఇలా ఉంటే గతంలో పవన్ , హరీష్ కాంబోలో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. మరి వీరి కాంబోలో రెండవ మూవీగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: