గత కొద్ది రోజులుగా లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్  పలు రకాల ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా అత్యాచారం కేసులో అరెస్టు అయ్యి బెయిల్ పైన బయటికి వచ్చిన జానీ మాస్టర్ కి ఇప్పుడు ఒక సడన్ షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం తనకు ఇచ్చేటువంటి  నేషనల్ ఫిలిం అవార్డు రద్దు చేయడం జరిగిందట. ఫోక్సో కేసు నమోదు కావడంతో ఈ అవార్డును సైతం రద్దు చేసినట్లు ఆ కమిటీ వెల్లడించింది.


జానీ మాస్టర్ తమిళ చిత్రం తిరుచిట్రంబలం  అనే చిత్రానికి గాను కొరియోగ్రాఫర్ గా చేయడంతో ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డుగా జానీ మాస్టర్ కి 2022 సంవత్సరానికి వచ్చింది. అక్టోబర్ 8వ తేదీన సైతం ఢిల్లీలో అందుకోవాల్సి ఉండగా అందుకు మధ్యంతర బెయిల్ ని కూడా కోర్టు ఇచ్చిన ఇప్పుడు అవార్డు రద్దు కావడం జరిగింది. లేడీ కొరియోగ్రాఫర్ పైన జానీ మాస్టర్ లైన్ కి దాడి చేసిన సమయంలో ఆమె మైనర్ కాదనే విధంగా ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ పైన ఫోక్సో కేసు పెట్టారు.


అలాగే జానీ మాస్టర్ షూటింగ్ సమయాలలో కార్వన్ లలో తీసుకువెళ్లి చాలా బలవంతం చేసే వారిని కొన్నిసార్లు కొట్టే వారిని కూడా మతం మార్చుకోమని హింసించే వారిని ఫిర్యాదుల ఆ లేడీ కొరియోగ్రాఫర్ తెలియజేసింది. ఇవే కాకుండా ప్రతిరోజు జానీ మాస్టర్ కేసులో ఏవో ఒక ట్విస్ట్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఇది ఈ కేసులో జానీ మాస్టర్ భార్య హస్తము కూడా ఉందనే విధంగా వార్తలు వినిపించాయి ఆమెపైన కూడా లేడీ కొరియోగ్రాఫర్ కేసు వేయడం జరిగింది. జానీ మాస్టర్ కు నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్ క్యాన్సిల్ చేసినట్లు ఒక లెటర్ ని కూడా విడుదల చేశారు. జానీ మాస్టర్ కు ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: