Kgf చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో యష్.. ఆ తర్వాత కేజీఫ్ -2 తో 2022లో సినిమాను విడుదల చేసి భారీ విజయాన్ని అందుకున్నారు.. మళ్లీ ఆ తర్వాత తన నుంచి ఎలాంటి సినిమా అనౌన్స్మెంట్ చేయలేదు. అయితే అనుకోకుండా ఈ ఏడాది లేడీ డైరెక్టర్ తో టాక్సిక్ అనే చిత్రాన్ని చేయబోతున్నట్లు తెలియజేశారు.ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించే విధంగా ప్లాన్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేయడం జరిగింది చిత్ర బృందం. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందనే విషయం వైరల్ గా మారుతున్నది. వాటి గురించి చూద్దాం.


పాన్ ఇండియా రేంజ్ లో పేరు సంపాదించిన యష్.. ఈ పేరు కాపాడుకోవడం కోసం పాన్ ఇండియా లేవిల్లోనే సినిమాలలో నటించేలా ఆచితూచి అడుగు వేస్తున్నారు. అందుకే కొంత గ్యాప్ అయినా పరవాలేదు కానీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో హీరోయిన్స్ గా నాయనతార, శృతిహాసన్, కియారా అద్వానీ, కరీనాకపూర్ ఇలా ఏవో ఒక పేర్లు ప్రచారంలో వినిపిస్తూ ఉండేవి. ఈ సినిమా మొత్తం డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించే విధంగా ప్లాన్ చేశారట.


కానీ టాక్సిక్ సినిమా పైన భారీ అంచనాలు ఉండడంతో డైరెక్టర్ గీతు మోహన్ దాస్ ఈ సినిమా టేకింగ్ విషయంలో హీరో యష్ అసంతృప్తితో ఉన్నారని పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ఈ లేడి డైరెక్టర్ హ్యాండిల్ చేయలేరేమో అని తనకి అనిపిస్తున్నట్లుగా భావించారట. అందుకే టాక్సిక్ చిత్రం ఆగిపోయిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మరి కొంతమంది మాత్రం ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాలవల్ల పోస్ట్పోన్ చేశారనే విధంగా తెలియజేస్తున్నారు. వాస్తవానికి 2025 కల్లా ఈ సినిమా విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: