ఏంటి ఎన్టీఆర్ ని లక్ష్మీ ప్రణతి ఆ సమయంలో నిజంగానే మోసం చేసిందా.. అంత పెద్ద వార్నింగ్ ఇచ్చినా కూడా ఎన్టీఆర్ ని అలా ఎలా మోసం చేస్తుంది..అని ఈ విషయం తెలిసిన చాలామంది ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్టీఆర్ ని ఏం చెప్పి లక్ష్మీ ప్రణతి మోసం చేసిందో ఇప్పుడు చూద్దాం.. జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిలది పెద్దలు కుదిర్చిన పెళ్లి.వీరిద్దరి పెళ్ళై దాదాపు దశాబ్దం దాటినా కూడా ఎక్కడ కూడా చిన్న గొడవ కూడా కనిపించదు. ఇక వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే రామలక్ష్మణుల్లాంటి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఇందులో పెద్దవాడు అభయ్ రామ్ పుట్టిన సమయంలో ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతికి వార్నింగ్ ఇచ్చారట. అదేంటంటే ఆ సమయంలో ఎన్టీఆర్ రభస మూవీ షూటింగ్లో ఉన్నారు. ఇక ఈ షూటింగ్ కోసం అవుట్డోర్ కి వెళ్లాల్సి వచ్చింది.అయితే అప్పటికే లక్ష్మీ ప్రణతికి 9 నెలలు. దాంతో ఇండియా వదిలి వెళ్లే సమయంలో లక్ష్మీ ప్రణతికి ఓ మాట  చెప్పారట.. 

నేను వచ్చే వరకు నువ్వు బిడ్డను కనకూడదు.. నాకు తెలియకుండా బిడ్డను కంటే బాగుండదు చూడు అంటూ వార్నింగ్ ఇచ్చారట. దానికి సరే అని తలూపిన లక్ష్మీ ప్రణతి ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడేదట. ఇక ఇండియాకి వచ్చే రోజు కూడా కాస్త భయం భయంగా భర్తతో మాట్లాడిందట. ఆ సమయంలో ఎన్టీఆర్ పసిగట్టి ఏమైంది అలా మాట్లాడుతున్నావ్ అంటే ఏం లేదు నార్మల్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్తున్నాను. డాక్టర్ రమ్మన్నారు అనగానే ఎన్టీఆర్ కి ఎక్కడో తేడా కొట్టిందట. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎన్టీఆర్ తల్లి శాలిని హాస్పిటల్ నుండి ఫోన్ చేసి నువ్వు హాస్పిటల్ కి వెంటనే రా అని చెప్పడంతో షాక్ అయిపోయిన ఎన్టీఆర్ వెంటనే హాస్పిటల్ కి చేరుకున్నారట.

 ఇక అదే సమయంలో ఎన్టీఆర్ సైన్ తీసుకున్నారు. కానీ అప్పటికే ఆపరేషన్ థియేటర్లో లక్ష్మీ ప్రణతి తన మొదటి బిడ్డ అభయ్ రామ్ కి జన్మనిచ్చింది. అలా అభయ్ రామ్ పుట్టిన సమయంలో నొప్పులు వచ్చినా కూడా తనకి డెలివరీ ఇంకా అవ్వలేదని నార్మల్ చెకప్ కోసం పోతున్నాను అంటూ ఎన్టీఆర్ ని మోసం చేసిందట లక్ష్మీ ప్రణతి. అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్స్ ఇందులో మోసం చేయడానికి ఏముంది 9 నెలలు నిండాక నొప్పులు వస్తే ఆమె మాత్రం ఏం చేస్తుంది పాపం అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: