సూపర్ స్టార్ మహేష్ బాబు , శ్రీను వైట్ల కాంబినేషన్లో మొదటగా దూకుడు అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా ... ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది  ఇకపోతే ఈ సినిమాతో మహేష్ బాబు క్రేజ్ మరింతగా పెరగగా ... శ్రీను వైట్ల ఈమేజ్ కూడా ఈ మూవీతో పెరిగిపోయింది. ఇక సమంత కు కూడా ఈ సినిమా తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది.

ఇక అంతలా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ చూపించింది. ఇక శ్రీను వైట్ల , మహేష్ బాబుకు దూకుడు మూవీ తో బ్లాక్ బస్టర్ విజయం అందించాడు. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో ఆగడు అనే మూవీ వచ్చింది. కానీ ఆ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటించగా ... సోను సూద్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ కి తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడానికి గల కారణాలను తాజాగా శ్రీను వైట్ల చెప్పుకొచ్చాడు. తాజాగా శ్రీను వైట్ల మాట్లాడుతూ ... దూకుడు సినిమా తర్వాత మహేష్ బాబు తో ఆగడు కాకుండా వేరే కథతో సినిమా చేయాలి అనుకున్నాను.

ఆ కథను మహేష్ బాబు కు వినిపించాను. అది సూపర్ గా ఉంది అని ఆయన అన్నాడు. కానీ నేను అప్పటికే నిర్మాతలను కమిట్ అయి ఉన్నాను. కానీ నేను మహేష్ బాబుకు చెప్పిన కథను రూపొందించాలి అంటే భారీ బడ్జెట్ అవుతుంది. నా నిర్మాతలు అప్పుడు చాలా స్ట్రగుల్స్ లో ఉన్నారు. దానితో తక్కువ బడ్జెట్ లో తీయాలి అని వేరే కథను ప్రిపేర్ చేశాను. దానిపై నా ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాను. కానీ అది ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది అని శ్రీను వైట్ల తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: