టాలీవుడ్ లోనే బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న‌ హీరోల్లో మాన్ అఫ్ మసస్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ప్రస్తుతం దేవర సక్సెస్ తో మరోసారి పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. ఇదే క్రమంలో  ఆయన చేసే తర్వాత సినిమాలు కూడా ఇదే రేంజ్ లో పాన్ ఇండియా స్థాయిలో వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ బాలీవుడ్ లో తొలిసారిగా నటిస్తున్న వార్2 ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. వచ్చే సంవత్సరం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రశాంత్ నీల్‌, ఎన్టీఆర్ మూవీ కూడా డిసెంబర్ నుంచి షూటింగ్ కి వెళ్లనుంది. దేవర2 షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.


ఇదే క్రమంలో తాజాగా జరిగిన మీడియా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడిన మాట నిజంగా అందర్నీ మైండ్ బ్లాక్ చేసింది. అందులో ఆయన పాపులర్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో చేరాలనే తన కోరికను చెప్పుకొచ్చాడు. మార్వెల్ ప్రపంచంలో భాగమవటానికి తను ఎంతో ఇష్టపడతానని.. ఎందుకంటే మార్వెల్ నాకు చాలా ప్రత్యేకమైనదని అందులో ఐరన్ మాన్ కచ్చితంగా నాకు ఇష్టమైన పాత్రలో ఒకటి అని...  ముఖ్యంగా మనకు సూపర్ పవర్ ఉండవలసిన అవసరం లేదు శక్తులను కలిగి ఉండడానికి మనం దేవుళ్ళు కాదు.. అందరికీ తెలుసు అతను కేవలం మనిషి అని ఆయన తన మనసుతో అది సాధించాడు ప్రతి ఒక్కరు సూపర్ హీరోలు కావటం చాలా సులభం నువ్వు నేను మేమంతా కాబట్టి మార్వెల్ నాకు చాలా ఎక్సైట్ చేసింది నేను కచ్చితంగా ప్రపంచంలో భాగం కావాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.


మార్వ‌ల్ సినిమాల్ని కిడ్స్ విప‌రీతంగా అభిమానిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇందుకు తార‌క్ పిల్ల‌లు మిన‌హాయింపు కాదు. ఎన్టీఆర్ తన పిల్లలు కూడా మార్వెల్‌ను ఇష్టపడతారని, తాను మార్వెల్ ప్రపంచంలో చేరితే వారు అతడిని చూసి గర్వపడతారని అన్నారు. నిజానికి మార్వ‌ల్ సినిమాటిక్ యూనివ‌ర్శ్ స్టోరీ టీమ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ని దృష్టిలో ఉంచుకుని ఒక పాత్రను సృష్టిస్తే దానిని హాలీవుడ్ తార‌ల‌కు ధీటుగా ర‌క్తి క‌ట్టించ‌గ‌ల ప్ర‌తిభావంతుడు. అందుకే అత‌డి వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. తార‌క్ త‌దుప‌రి దేవ‌ర 2ని పూర్తి చేసి విడుద‌ల చేయాల్సి ఉంది. కాన్వాస్ ప‌రంగా మొద‌టి భాగం కంటే చాలా పెద్ద స్పాన్ తో ఉంటుంద‌ని కూడా తార‌క్ వెల్ల‌డించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌ను ప్రారంభించే ముందు వార్ 2 ప‌నుల్ని తార‌క్ పూర్తి చేస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: