క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ చాలా కాలం క్రితం ఖడ్గం అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీకాంత్ , రవితేజ , ప్రకాష్ రాజు ప్రధాన పాత్రలలో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సినిమాకు సంగీతం అందించగా ... మధు మురళిమూవీ ని నిర్మించాడు. ఇకపోతే భారీ అంచనాల నడవ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఈ మూవీ ద్వారా కృష్ణ వంశీ కి అలాగే ఈ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన శ్రీకాంత్ , రవితేజ , ప్రకాష్ రాజ్ లకి అద్భుతమైన గుర్తింపు లభించింది.

ఇకపోతే ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే రీ రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. దానితో ఈ సినిమా బృందం ప్రస్తుతం ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా శ్రీకాంత్సినిమా రీ రిలీస్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా శ్రీకాంత్ అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. శ్రీకాంత్ తాజాగా మాట్లాడుతూ ... ఖడ్గం సినిమా ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది.

కాకపోతే ఆ సినిమాలో నేను చేసిన పాత్రకు నన్ను వద్దు అని ఈ మూవీ నిర్మాత అయినటువంటి మధు మురళి మొదటి నుండి వాదిస్తూ వచ్చాడు. కాకపోతే కృష్ణ వంశీ మాత్రం ఆ పాత్రకు నేనే కరెక్ట్ అని అనుకున్నాడు. అందుకే ఖచ్చితంగా నన్నే పెట్టి ఆ పాత్ర చేయాలి అనుకున్నాడు. అలా కృష్ణ వంశీ అనుకున్నాడు కాబట్టి ఖడ్గం సినిమాలో నేను ఆ పాత్రలో నటించగలిగాను అని శ్రీకాంత్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ కు సూపర్ సాలిడ్ గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: