ప్రియా భవానీ శంకర్. ఈ అందాల తమిళ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. న్యూస్ రీడర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియా ఆ తర్వాత తమిళ బుల్లితెరపై సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంది. ‘మేయాద మాన్’ తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత వరుస హిట్లతో కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది.  ఇక సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ‘కళ్యాణం కమనీయం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీలో తన అందం, అభినయంతో సినీ ప్రియుల్ని కట్టిపడేసింది. ఆ తర్వాత నాగ చైతన్య

 ధూత వెబ్ సిరీస్‌లోనూ నటించి అదరగొట్టేసింది. అలాగే ఇటీవల గోపీచంద్ నటించిన ‘భీమా’ సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.  ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోయిన్లు స్కిన్ షో చేస్తుండటంపై కీలక వ్యాఖ్యలు చేశారు...చాలా మంది సినిమా రంగంఅంటేనే గ్లామర్ గా ఉండాలని భావిస్తారు. అదే విధంగా అక్కడ క్విడ్ ప్రో కో ఉంటుందని, మంచి చాన్స్ లు రావాలంటే.. దేనీకైన రెడీగా ఉండాలని తరచుగా వార్తలు విన్పిస్తూ ఉంటాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి గ్లామర్‌గా కనిపించడం నాకు అస్సలు నచ్చదు.

 అలాంటి బోల్డ్ రోల్స్ ని నేను ఒప్పుకోను. కెరీర్‌ పరంగా ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ విషయంలోనూ బాధపడకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను. అందుకే, నా శరీరాన్ని ఎప్పుడూ ఒక వస్తువుగా నేను భావించను. అందాలు చూపించి అవకాశాలు అందుకోవాలని అనుకోవడం లేదు. అందుకే, సినిమాల ఎంపిక విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటా. అయితే, నెగెటివ్‌ రోల్‌ చేయడానికీ కూడా వెనుకాడను. ఎందుకంటే నటన అనేది నా వృత్తి. అలాగే, ఒక హీరోయిన్‌ గా ఫ్యాషన్‌ పేరుతో అందాలను మాత్రం ప్రమోట్‌ చేయలేను' ' అంటూ చెప్పుకొచ్చింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: