మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీమణులు ఉన్న సంగతి తెలిసిందే అందులో కొంతమంది సక్సెస్ అవుతుంటే మరి కొంతమంది అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నారు. ముఖ్యంగా.. మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తెలుగు అమ్మాయిలు కాకుండా ఎక్కువ శాతం... వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు. కేరళ తమిళనాడు లేదా కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీని వెళ్తున్నారు. అలా వచ్చిన వారిలో... ప్రియా భవాని శంకర్ ఒకరు.


కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవాని శంకర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 1989 సంవత్సరంలో జన్మించిన హీరోయిన్ ప్రియా భవాని శంకర్... తన కెరీర్ ప్రారంభంలో న్యూస్ యాంకర్ గా అప్పన చేశారు. ఆ తర్వాత హీరోయిన్ గా రాణించేందుకు.. ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. వైభవ్ రెడ్డి హీరోగా చేసిన మేయదా మాన్  అనే సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమాకు ఆమెకు ఉత్తమ నటిగా అవార్డు కూడా రావడం జరిగింది.

 
ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఛాన్సులు కొట్టేసింది. అంతేకాదు కోలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో కార్తీ చేసిన.. చినబాబు రీమేక్ లో కూడా సెకండ్ హీరోయిన్గా నటించి అందరిని మెప్పించింది. అటు ఎస్ జె సూర్య జోడిగా మాన్ స్టార్... మెరిసి సక్సెస్ అందుకుంది ప్రియా భవాని శంకర్. అయితే అలాంటి హీరోయిన్ ప్రియా భవాని శంకర్. సినిమాలలో నటించేందుకు బట్టలు కూడా విప్పాలని కొంతమంది చెప్పారట. ఇదే విషయాన్ని తాజాగా ఆమె పేర్కొంది.


గ్లామర్ పేరుతో శరీరాన్ని తాను చూపించలేనని...  ఆ సందర్భంగా ప్రియా భవాని శంకర్‌ చెప్పినట్లు తాజాగా పేర్కొన్నారు. ఇప్పటికి కూడా గ్లామర్ పేరుతో శరీరాన్ని చూపించేందుకు తనకు ఇష్టం లేదని తెలిపారు  ప్రియా భవాని శంకర్‌. హీరోయిన్ ఒక ఆట వస్తువు కాదని.. ఎవరికి పడితే వారికి చూపించేందుకు తన శరీరం... ఒక ఆట వస్తువు కాదని  ప్రియా భవాని శంకర్‌ పేర్కొన్నారు. కెరీర్ పరంగా ఎప్పుడైనా... అవకాశాలు వస్తే చేస్తాను... రాకపోతే ఇంట్లో కూర్చుంటాను అని తెలిపింది.  కానీ పొట్టి బట్టలతో తిరిగానని ఆమె వెల్లడించడం జరిగింది. కాగా ఇటీవల కళ్యాణం కమనీయం అలాగే రత్నం సినిమాలలో ప్రియా భవాని శంకర్ మెరిసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: