దసరా కు టాప్ హీరోల సినిమాలు రేసులో లేకపోవడంతో ఈ పండుగ పై భారీ ఆశలు పెట్టుకుని అక్టోబర్ 11న గోపీచంద్ ‘విశ్వం’ రాబోతోంది. హీరో గోపీ చంద్ హిట్ అన్న పదం విని కొన్ని సంవత్సరాలు అవుతోంది. దీనితో అతడి పై సగటు ప్రేక్షకులలో పెద్దగా క్రేజ్ లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈవారం విడుదల కాబోతున్న ‘విశ్వం’ భారాన్ని నలుగురు మోస్తూ ఉండటంతో ఈమూవీ ఫలితం పి ఇండస్ట్రీ వర్గాలలో ఆశక్తి ఉంది.



దర్శకుడు శ్రీను వైట్ల ఈమూవీకి దర్శకుడుగా తనదైన స్టైల్ లో కామెడీ రొటీన్ ను కొనసాగిస్తూ పూర్తి యాక్షన్ మూవీగా ఈమూవీని నిర్మించాడు అని కొందరు అంటున్నారు. కోన వెంకట్ శ్రీను వైట్ల క్యాంప్ నుండి తప్పుకున్న తరువాత సరైన హిట్ రాలేదు అన్న సెంటిమెంట్ ప్రేక్షకులలో ఉంది. మాస్ కామెడీ యాక్షన్ మూవీగా శ్రీనువైట్ల ఈమూవీని తీశాడు అంటూ లీకులు వస్తున్నప్పటికీ ఎంతవరకు ప్రస్తుత తరం దర్శకులతో ఏదీ మిస్ చేయకుండా ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తీశానని ఈమూవీ దర్శకుడు చెపుతున్నాడు.



ఇక ఈమూవీ హీరోయిన్ కావ్య థాపర్ కూడ ఇప్పటివరకు హిట్ అందుకోలేకపోవడంతో ఆమె కూడ ఈమూవీ ఫలితం గురించి ఆశక్తిగా ఎదురు చూస్తోంది. అదేవిధంగా ఈమూవీ నిర్మాత విశ్వ ప్రసాద్ కు ఇప్పటి వరకు లక్ కలిసి రాకపోవడంతో ఈమూవీ ఫలితం గురించి ఈమూవీ నిర్మాతలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈమధ్య కాలంలో ఈ నిర్మాతలు నిర్మించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతున్న పరిస్థితులలో ఈమూవీ సక్సస్ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.



నిర్మాతగ మరిన్ని సినిమాలు సినిమాలు విశ్వప్రసాద్ నుండి రావాలి అంటే ఈమూవీ సక్సస్ మరింత జోష్ ను ఆయనకు చేకూర్చే అవకాశం ఉంది. ‘దూకుడు’ సినిమా సూపయర్ సక్సస్ తరువాత ఒక వెలుగు వెలిగిన శ్రీను వైట్ల మళ్ళీ ట్రాక్ లోకి రావాలి అంటే ఈమూవీ ఖచ్చితంగా హిట్ అయి తీరాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: