ప్రియమణి.. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ పెళ్ళై దాదాపు దశాబ్దానికి దగ్గర పడుతున్నా కూడా ఇంకా పిల్లల్ని కనడం లేదు.అయితే ప్రియమణి పిల్లల్ని కనకపోవడానికి ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో రూమర్లు వినిపించాయి.. సినిమా అవకాశాలు ఎక్కడ పోతాయో అని పిల్లల్ని కనడం లేదని కొంతమంది అంటే, ప్రియమణికి పిల్లలు పుట్టరని మరికొంత మంది ఇలా ఎన్నో ఊహగానాలు ప్రియమణి వైవాహిక జీవితంపై పుట్టుకొచ్చాయి. అయితే తాజాగా ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు వింటే మాత్రం అందరూ షాకవ్వాల్సిందే. ఇక ప్రియమణి పిల్లల్ని కనక పోవడానికి కారణం కూడా ఇదే అనుకుంటారు చాలామంది. మరి ఇంతకీ అసలు విషయం ఏంటయ్యా అంటే.. ముస్తఫా రాజ్ ని కలిసిన తర్వాత ప్రియమణి పెళ్ళంటూ చేసుకుంటే ఆయననే చేసుకోవాలి అని ఫిక్స్ అయిందట. అయితే అప్పటికే ముస్తఫా రాజ్ కి పెళ్లయినప్పటికీ మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి ప్రియమణిని పెళ్లి చేసుకున్నారు. ఇక ప్రియమణి ముస్లిం మతానికి చెందిన ముస్తఫారాజ్ ని పెళ్లి చేసుకుంటున్నాను అని ఫేస్బుక్లో పోస్ట్ చేయగానే చాలామంది ఈమెకు కామెంట్లు పెట్టారు.

ఇస్లాం మతానికి చెందిన వ్యక్తిని హిందూ మతస్తురాలైన ప్రియమణి పెళ్లి చేసుకుంటుండంతో మీ ఇద్దరికీ పుట్టే పిల్లలు జిహాదీలుగా.. ఉగ్రవాదులుగా.. తయారవుతారంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు. అయితే ఈ కామెంట్స్ చూసిన ప్రియమణి మనసు ఎంతగానో బాధపడిందట. ఈ విషయాన్ని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొని ప్రియమణి బాధపడింది. అంతేకాదు ప్రేమకి కులం మతం అనే అడ్డు ఉండదు. దానికి వ్యతిరేకంగా మేము పెళ్లి చేసుకున్నాం.కానీ వాళ్ళు పెట్టిన మెసేజ్లు చూసి మాత్రం మేము చాలా నిరాశపడ్డాం.ఇక నేను ఈద్ కి శుభాకాంక్షలు తెలియజేసినప్పుడు ప్రియమణి పూర్తిగా ఇస్లాం మతంలోకి వెళ్ళింది.ఆమె హిందూ మతాన్ని వదిలేసి ఇస్లాం మతాన్ని స్వీకరించింది అని పోస్టులు పెట్టారు. కానీ నేను హిందూ మతాన్ని ఎప్పటికీ వదిలిపెట్టను.చచ్చే వరకు హిందూ మతం లోనే ఉంటాను.

నేను వేరే మతస్థుడిని పెళ్లి చేసుకున్నప్పటికీ మేం ఇరువురం ఒకరి మతాలను ఒకరం గౌరవించుకుంటాం. ఈద్ కి పోస్ట్ పెట్టావు మరి నవరాత్రికి ఎందుకు పోస్ట్ పెట్టలేదని కొంత మంది నన్ను అడిగారు.కానీ ఇప్పుడు నేను పోస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఏంటో నాకు తెలుసు. నేను ఎప్పటికీ హిందువునే వీరి మాటలకు నేను భయపడాల్సిన అవసరం లేదు. అంటూ రీసెంట్ గా ఫిలింఫేర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమణి తన బాధను అంత బయటపెట్టింది. అయితే ప్రియమణి మాట్లాడిన ఇంటర్వ్యూ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్స్  పిల్లలు పుడితే జిహాదీలు, ఉగ్రవాదులు అవుతారని వాళ్ళు అనడం వల్లే మీరు ఇంకా పిల్లల్ని కనడం లేదా ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం ప్రియమణి కోలీవుడ్ హీరో విజయ్ తలపతి హీరోగా చేస్తున్న మూవీలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: